పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటేనే అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడతాయి. అలాంటిది ఈసారి “ఓజి” సినిమాతో ఏకంగా అతని రేంజ్కి మించిన హైప్ క్రియేట్ అయింది. ఇది పవన్ కెరీర్లోనే బెస్ట్ ప్రాజెక్ట్గా చెప్పుకుంటున్నారు సినీ వర్గాలు.
ఈ సినిమాపై ఏర్పడిన ఆసక్తికి తగినట్టుగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ సినిమా బిజినెస్ ఊహించని రేంజ్లో జరుగుతోంది. సీడెడ్ చేస్తే ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే మేకర్స్ దాదాపు 80 కోట్లకిపైగా రేటుకి ఈ సినిమాను అమ్మేశారన్న సమాచారం వినిపిస్తోంది. దీన్ని బట్టి ఓజి మీద పబ్లిక్లో ఉన్న క్రేజ్ ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతుంది.
ఇక సీడెడ్లో ఇంకా డీల్ క్లోజ్ కావాల్సి ఉంది. అక్కడ కూడా భారీ స్థాయిలో బిజినెస్ జరిగే అవకాశం ఉందని ట్రేడ్ సర్కిల్స్ అంచనా వేస్తున్నాయి.
ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తుండగా, అర్జున్ దాస్, శ్రీయ రెడ్డి వంటి నటులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను భారీ ఖర్చుతో నిర్మిస్తోంది.
ప్రస్తుతం షూటింగ్ పనులు వేగంగా పూర్తి అవుతుండగా, సెప్టెంబర్ 25న ఈ సినిమాను థియేటర్లలో గ్రాండ్గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు అందరి దృష్టి ఓజి మీదే ఉంది.