తేజా సజ్జా నెక్ట్స్‌ సినిమా గురించి అధికారిక ప్రకటన నేడు

బాల నటుడిగా కెరీర్ మొదలు పెట్టిన తేజ సజ్జా. ప్రస్తుతం హీరోగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ వర్మ, తేజ కాంబోలో వచ్చిన జాంబీరెడ్డి ద్వారా తేజ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. నందినిరెడ్డి డైరెక్షనలో వచ్చిన ఓ బేబీ సినిమాలో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ గా చేశాడు. ఆ తరువాత ఇష్క్‌, అద్భుతం సినిమాలు చేసి ఓకే అనిపించుకున్నాడు.

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా మరోసారి ప్రశాంత్‌ వర్మ, తేజ కాంబోలో వచ్చిన హనుమాన్ సినిమా ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో తెలిసిందే. ఈ సినిమా దాదాపు 350 కోట్లు రాబట్టి రికార్డులు బద్దలు కొట్టింది. ఈ క్రమంలోనే తేజ తరువాత చిత్రం అందరూ జై హనుమాన్‌ అనుకున్నారు.కానీ ఆ సినిమాలో తేజ క్యారెక్టర్‌ కొంచెం సేపు ఉంటుందని… డైరెక్టర్ ఇప్పటికే చెప్పుకొచ్చారు.

దీంతో తేజ సజ్జా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తేజ తన తరువాతి సినిమా ఈగల్ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేనితో చేయబోతున్నట్లు టాక్‌. ఇప్పటికే ఈ విషయాన్ని ఈగల్ ప్రమోషన్స్ లో భాగంగా  కార్తీక్ ఘట్టమనేని చెప్పుకొచ్చారు. ఇక తాజాగా అందుతున్న సమాచారం మేరకు తేజ సజ్జా కార్తీక్ ఘట్టమనేని సినిమా అధికారిక ప్రకటన శనివారం రాబోతుంది. 

Related Posts

Comments

spot_img

Recent Stories