ప్రస్తుతం దేశవ్యాప్తంగా మళ్లీ సంచలనం సృష్టించబోతున్న సినిమా “బాహుబలి ది ఎపిక్”. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, విజన్రీ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా ఒకప్పుడు ఇండియన్ సినిమా స్థాయిని పూర్తిగా మార్చేసింది. ఇప్పుడు ఈ మహత్తర చిత్రం రీరిలీజ్ అవుతుండటంతో మళ్లీ ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ నెలకొంది.
ఇక రెండు భాగాలుగా వచ్చిన ఈ సినిమాకి మళ్లీ థియేటర్లలో భారీ స్పందన రావడం ఖాయం అనుకుంటున్నారు. కానీ ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో “బాహుబలి పార్ట్ 3”కు హింట్ ఇస్తారట అనే వార్తలు బాగా వైరల్ అయ్యాయి. అయితే ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని నిర్మాత శోభు యార్లగడ్డ స్పష్టం చేశారు.
అయినా సరే ఆయన మాటల్లో మరో ఇంట్రెస్టింగ్ అంశం దాగి ఉంది. పార్ట్ 3 లేనప్పటికీ, రీరిలీజ్లో ఒక చిన్న సర్ప్రైజ్ ఉండొచ్చని ఆయన సూచించారు. ప్రస్తుతం సినిమా టీమ్ అందరూ రీరిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నారని కూడా చెప్పారు.
అంటే బాహుబలి అభిమానులకు కొత్త చాప్టర్ కాకపోయినా, ఏదో కొత్త అనుభూతి మాత్రం థియేటర్లో దొరకొచ్చని అర్థం.