మంచు విష్ణు ఎన్నో రోజులుగా డ్రీమ్ ప్రాజెక్ట్గా రూపొందిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ కన్నప్ప ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రానుంది. మరికొద్ది గంటల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతోంది. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ మైథలాజికల్ యాక్షన్ డ్రామాలో భారీ తారాగణం కనిపించబోతోంది. ఈ సినిమాపై ఆరంభం నుంచి భారీ ఆసక్తి నెలకొనడం, కాస్టింగ్ పరంగా ఉన్న గ్రాండ్ లెవెల్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి.
ఇక ఈ సినిమాపై మంచు విష్ణు విశ్వాసం చాలా బలంగా ఉంది. భారీ స్కేల్లో తెరకెక్కిన ఈ సినిమా ఎమోషన్స్, విజువల్స్, యాక్షన్ ఎలిమెంట్స్తో ప్రేక్షకులను థ్రిల్ చేయబోతోందని ఆయన ధీమాగా చెబుతున్నారు. ఇది ప్రతి ఒక్కరిని థియేటర్లకే రప్పించేలా ఉంటుందని, కుటుంబం మొత్తంగా కలిసి చూసేలా రూపొందించామని చెప్పుకున్నారు.
ఇక ఈ సినిమా ఓటీటీ విడుదలపై కూడా మంచు విష్ణు క్లారిటీ ఇచ్చారు. ఈలాంటి చిత్రాలు పెద్ద తెరపై చూడడం వేరు అనే భావనతో, సినిమా రిలీజ్ అయిన పదివారాల తర్వాతే ఓటీటీలో అందుబాటులోకి రాబోతుందంటూ తెలిపారు. థియేటర్లలోనే ఈ చిత్రాన్ని ఎక్కువమంది చూసేలా చేయాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.
కన్నప్ప సినిమాలో విష్ణుతో పాటు మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ వంటి భారీ తారాగణం కనిపించబోతోంది. పౌరాణిక కథను ఆధునిక టేకింగ్తో చూపించబోతున్న ఈ సినిమా ఎలాంటి స్పందన తెచ్చుకుంటుందో చూడాలి.