తమిళ హీరో సూర్య కి తెలుగులో డైరెక్ట్ సినిమా చేయాలని చాలా కాలంగా కోరిక ఉంది. చివరకు ఈ ప్రయత్నం ఫలితం ఇచ్చింది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. రామానాయుడు స్టూడియోలో జరిగిన పూజా కార్యక్రమంతో ఈ ప్రాజెక్ట్ అధికారికంగా మొదలైంది. ఈ నెలలో మొదలయ్యే షెడ్యూల్లో ఒక భారీ యాక్షన్ సీన్ షూట్ చేయబోతున్నారు. ఈ సీన్లో సూర్యతో పాటు దాదాపు వంద మంది జూనియర్ ఆర్టిస్టులు కూడా పాల్గొనబోతున్నారని సమాచారం.
ఇక ఈ సినిమాకు సంగీతం అందించడానికి జీవీ ప్రకాష్ ఇప్పటికే వెంకీ అట్లూరితో కలిసి మ్యూజిక్ పనులు మొదలు పెట్టేశాడు. మొదట హీరోయిన్గా భాగ్యశ్రీ భోర్సేను తీసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. అయితే తరువాత కాయదు లోహర్నే ఫైనల్ చేసినట్టు టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. సూర్య తొలిసారి తెలుగులో డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఏ స్థాయిలో హిట్ అవుతుందో చూడాలి.