కేజీఎఫ్‌ 3 పై కొత్త రూమార్‌..ఏంటో తెలుసా!

ఎన్టీఆర్ తో తన తరువాత సినిమా చేసేందుకు గట్టి ప్రయత్నాల్లో ఉన్నాడు స్టార్‌ డైరెకర్ ప్రశాంత్ నీల్. ఇప్పుడున్న సమాచారం ప్రకారం సెప్టెంబర్ నుంచి ఓ యాక్షన్ షెడ్యూల్ ను మొదలు పెడతారని.. ఈ షెడ్యూల్ లో ఎన్టీఆర్ తో పాటు యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ కూడా చేరతారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఐతే, ఇదిలా ఉంటే.. తాజాగా ప్రశాంత్ నీల్ 2026లో ‘కేజీఎఫ్-3’ని స్టార్ట్ చేస్తారనే వార్త కోలీవుడ్‌ వర్గాల్లో తెగ తిరేగేస్తుంది.

పైగా కేజీఎఫ్-3 లో హీరో యశ్ కాదట. తమిళ హీరో అజిత్‌ అని సమాచారం. ఆల్ రెడీ అజిత్‌ అగ్రిమెంట్‌పై సంతకం చేశారని కూడా ఆ కథనాల సారాంశం. ఈ వార్త పై మూవీ టీమ్ నుంచి అయితే ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతానికి ప్రశాంత్ నీల్ మాత్రం ఓన్లీ ఎన్టీఆర్ సినిమా పైనే తన ఫుల్ ఫోకస్ పెట్టినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.

అన్నట్టు ఆ మధ్య ఈ పవర్‌ హౌస్ ప్రాజెక్ట్ కోసం మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి అంటూ ఈ చిత్రబృందం ఓ మెసేజ్ ను కూడా సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసింది. మొత్తానికి ఈ సినిమా పై అంచనాలు భారీగానే పెరిగాయి.

Related Posts

Comments

spot_img

Recent Stories