కొత్త రూమార్‌!

కొత్త రూమార్‌! డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. లైగర్, డబుల్ ఇస్మార్ట్ వంటి డిజాస్టర్ల తర్వాత కొత్త సినిమా కోసం రెడీ అయ్యాడు. హీరో గోపీచంద్‌కు ఓ కథ వినిపించినట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఐతే, ఈ సినిమా షూటింగ్ కి ప్రస్తుతం కసరత్తులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీలను తీసుకునే అవకాశం ఉందట. త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన వస్తుందని తెలుస్తోంది. అన్నట్టు వీరిద్దరి కాంబోలో 2010లో వచ్చిన ‘గోలీమార్’ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. అన్నట్టు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా వచ్చిన “డబుల్ ఇస్మార్ట్” ఆశించిన స్థాయిలో పాజిటివ్ టాక్ ను తెచ్చుకోలేక పోయింది. ముఖ్యంగా పూరి గత సినిమాలతో పోల్చుకుంటే.. ఈ సినిమాలో బలమైన కంటెంట్ మిస్ అయ్యింది అంటూ కామెంట్స్ వినిపించాయి. ఈ నేపథ్యంలో పూరి, గోపీచంద్ కోసం ఎలాంటి కథను రాశాడో చూడాలి.

Related Posts

Comments

spot_img

Recent Stories