ఎంఎస్‌ సుబ్బలక్ష్మిగా రాబోతున్న నయనతార!

గత కొంత కాలంగా  రాజకీయ నేతలు, క్రీడాకారులు, సంగీత విద్వాంసులు, సినీ ప్రముఖుల జీవిత చరిత్రలను ఆధారంగా చేసుకుని బయోగ్రఫీ సినిమాలుగా వస్తున్నాయి.  ఈ నేపథ్యంలో ప్రముఖ సంగీత విద్యాంసురాలు, గాయని ఎంఎస్‌ సుబ్బులక్ష్మి జీవిత చరిత్ర వెండితెరపై దృశ్య కావ్యంగా రూపుదిద్దుకోనుంది.

నిజానికి కొంతకాలం క్రితమే ఈ బయోగ్రఫీ గురించి ఓ వార్త బయటకి వచ్చింది. బాలీవుడ్‌ నటి విద్యా బాలన్ ప్రధాన పాత్రధారిగా ఈ చిత్రం తెరకెక్కుతుందనే ప్రచారం జరిగింది. అయితే, ఇపుడు ఆ పాత్రలో నయనతార నటించనున్నట్టు సమాచారం.ఈ ప్రాజెక్టు చేపట్టే బెంగుళూరుకు చెందిన నిర్మాణ కంపెనీ ప్రధాన పాత్రలకు సరిపోయేలా నయనతార, రష్మిక మందన్నా,  త్రిష  తదితరుల పేర్లను పరిశీలిస్తుంది. తమిళం, కన్నడం, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కే ఈ చిత్రంలో తెరకెక్కించే ఈ చిత్రంలో నయనతార ను ఎంపిక చేసేందుకు ఆసక్తి  చూపినట్టు తెలుస్తుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories