మనసులో మాట బయటపెట్టిన నయన్‌!

కోలీవుడ్ లో లేడీ సూపర్ స్టార్ గా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ ను ప్రేమించి, వివాహ బంధంతో ఒక్కటైన సంగతి అందరికీ తెలిసిందే. గత కొన్ని సంవత్సరాలుగా ఈ జంట సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తమ జీవితంలోని ప్రతి ముఖ్యమైన క్షణాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇక తాజాగా వీరిద్దరి పెళ్లి జరగి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా నయనతార భావోద్వేగపోస్ట్ తో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది.

మూడో వార్షికోత్సవం రోజున నయన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫొటోలు షేర్ చేస్తూ, విఘ్నేష్‌తో గడిపిన అనుభూతులను మనసులో పెట్టుకోకుండా బయటపెట్టింది. అతనిచే అందుకున్న ప్రేమను మాటల్లో వివరించలేనంతగా ఉన్నదని పేర్కొంది. నిజమైన ప్రేమ అంటే ఎలా ఉంటుందో తన జీవితంలో విఘ్నేష్ రూపంలో తెలిసిందని చెప్పింది. ఇద్దరుగా మొదలైన వారి ప్రయాణం ఇప్పుడు ఇద్దరు పిల్లలతో నలుగురిగా మారిందని, జీవితం ఇంతకంటే చక్కగా ఎలా మారుతుందని ప్రశ్నిస్తూ భావనలతో నిండిన పోస్ట్ పెట్టింది.

నయనతార పోస్ట్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఫ్యాన్స్ ఈ జంటపై మరోసారి అభిమానాన్ని వెల్లగక్కుతున్నారు. ప్రేమలో ఉన్న ఇద్దరి మధ్య ఎలాంటి బంధం ఉంటుందో, ఒకరిపై ఒకరికి ఎంత గాఢమైన అభిమానం ఉంటుందో ఈ పోస్ట్ ద్వారా స్పష్టంగా తెలుస్తోంది. ఇక తమ ప్రేమను బలంగా నిలిపుకుంటూ ముందుకు సాగుతున్న ఈ జంటకు సెలబ్రిటీలు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories