రామ్ లల్లాను దర్శించుకున్న మిస్టర్‌ బచ్చన్‌ టీమ్‌!

మాస్‌ మహారాజా రవితేజ- మాస్‌ డైరెక్టర్‌ హారీష్‌ శంకర్‌ కాంబోలో మరోసారి రాబోతున్న సినిమా మిస్టర్‌ బచ్చన్‌. యూపీలో సుమారు 30 రోజుల పాటు సుదీర్ఘ షెడ్యూల్‌ ను పూర్తి చేసుకుంది. కీలక షెడ్యూల్‌ పూర్తి చేయడంతో డైరెక్టర్‌ శంకర్‌ అండ్‌ టీం అయోధ్య ఆలయానికి వెళ్లి రామ్‌ లల్లా ఆశీస్సులు తీసుకున్నారు.

ఆలయం దగ్గర చిత్ర బృందం ఉన్న ఫోటోలను ఈరోజు సోషల్‌ మీడియాలో విడుదల చేశారు. ఈ సినిమా విషయానికి వస్తే హరీష్‌ శంకర్‌ చాలా వేగంగా సినిమాని తెరకెక్కిస్తున్నారు. రవితేజ  పవర్ ఫుల్ క్యారెక్టర్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో సీనియర్‌ నటుడు జగపతిబాబు కీలక పాత్రలో నటిస్తుండగా ఆయన క్యారెక్టర్ కు సంబంధించిన పోస్టర్ ను ఇటీవలే విడుదల చేశారు.

మరో పక్క ఈ సినిమాలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా చేస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్ ఈ నిర్మిస్తుండగా… వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories