రష్మిక కు మోడీ రిప్లై..వైరల్‌!

ప్రస్తుతం ఇండస్ట్రీతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ విజయాలు అందుకుంటూ భారీ ఆఫర్స్‌ ను వరుస లో పెడుతున్న హీరోయిన్స్‌ లో యంగ్‌ బ్యూటీఫుల్‌ ముద్దుగుమ్మ రష్మిక ఒకరు. ప్రస్తుతం రష్మిక హీరోయిన్ గా “పుష్ప 2” తో పాటు, బాలీవుడ్ లో “సికిందర్” తదితర భారీ చిత్రాలు అనేక భాషల్లో చేస్తుండగా తాను మై ఇండియా అంటూ చేసిన పోస్ట్ తాజాగా బాగా  వైరల్ అయ్యింది.

అయితే దీనికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ రిప్లై ఇవ్వడం విశేషం. సౌత్ ఇండియా టు నార్త్ ఇండియా, వెస్ట్ ఇండియా టు ఈస్ట్ ఇండియా వరకు అందరి హృదయాలు కలుపుకుంటూ వెళ్ళాలి అంటూ రష్మిక తన సోషల్‌ మీడియా ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది.
దానికి భారత ప్రధాని  నరేంద్ర మోడీ నుంచి ఎవరూ ఊహించని విధంగా రిప్లై ఇవ్వడంతో ఆ పోస్ట్‌ ప్రస్తుతం వైరల్‌ అవుతుంది.

భారత ప్రధాని మోడీ రిప్లై ఇస్తూ “కచ్చితంగా! మనుషుల్ని కలుపుకుంటూ వెళ్తూ వారి జీవితాల్ని మెరుగు పరచడం కంటే ఏది సంతృప్తి ఇవ్వదు” అంటూ తెలిపారు.

Related Posts

Comments

spot_img

Recent Stories