తప్పుకున్న సూర్య, లోకేష్‌!

ఆకాశమే హద్దురా, గురు వంటి సినిమాలను తెరకెక్కించిన సుధా కొంగర డైరెక్షన్‌ లో  శివకార్తికేయన్ హీరోగా ‘పురాణనూరు’ అనే భారీ బడ్జెట్ సినిమా రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమాకు ఆది నుండి అవరోధాలు వస్తునే ఉన్నాయి. మొదట ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో సూర్యని కథానాయకుడిగా తీసుకున్నారు. కానీ అనుకోని కారణాల వలన ఈ సినిమా నుండి సూర్య తప్పుకోవడంతో ఆ స్థానంలోకి శివకార్తికేయన్ వచ్చి చేరాడు. ఇక హీరోయిన్ గా మొదటి మలయాళ భామ నజ్రియాను ఎంపిక చేసారు, డేట్స్ కుదరకపోవడంతో టాలీవుడ్ డాన్సింగ్ డాల్ శ్రీలీలను కథానాయికగా తీసుకున్నారు.

ఇందుకు సంబంధించి ఫోటో షూట్ కూడా కంప్లిట్ చేసారు. కాగా ఈ సినిమలో శివకార్తికేయన్ బ్రదర్ గా మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ ఫస్ట్ ఛాయిస్ గా ఎంపిక చేసారు, అందుకు దుల్కర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కానీ ఇప్పుడు దుల్కర్  కూడా ఈ  సినిమా నుండి తప్పుకున్నాడు. ఈ ప్లేస్ లో తమిళ హీరో అథర్వను తీసుకున్నారు. ఇక విలన్ రోల్ కోసం తమిళ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ యాక్ట్‌ చేస్తున్నట్లు కొంతకాలం క్రితం వార్తలు వచ్చాయి.

కానీ లోకేష్ తప్పుకున్నాడని తాజాగా ఆ ప్లేస్‌ లో విజయ్ వర్మ పేరు వినిపించగా లేటెస్ట్ గా ఈ పాత్ర కోసం మలయాళ నటుడు రోషన్ మాత్యు ని ఫిక్స్ చేసారని సమాచారం. దర్శకురాలు తప్ప మిగతా టీమ్ అంతా మార్చిన ఈ సినిమా రెగ్యులర్ షూట్ జనవరిలో మొదలు కానుంది. శివకార్తికేయన్ కెరీర్ లో ల్యాండ్ మార్క్ 25వ సినిమాగా పురాణనూరు రానుంది . తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టనున్న శ్రీలీల అక్కడ ఏ మేరకు రాణిస్తుందో చూడాలి.

Previous article
Next article

Related Posts

Comments

spot_img

Recent Stories