అల్లు జంటను అన్‌ఫాలో చేసిన మెగా మేనల్లుడు!

గత కొంతకాలంగా సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీ వర్సెస్‌ అల్లు అర్జున్‌ అనే చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగితే ఆయనకు కేవలం సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపి తన స్నేహితుడు అని చెప్పి నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవి ఇంటికి ప్రచారానికి వెళ్లారు.

దీంతో ఈ విషయం గురించి మెగా అభిమానులు పెద్ద ఎత్తున అల్లు అర్జున్ ను టార్గెట్‌ చేసిన విషయం తెలిసిందే. దీంతో అల్లు ఫ్యాన్స్ కూడా ఏమాత్రం తగ్గకుండా బన్నీని వెనకేసుకొస్తూ..మెగా హీరోల మీద తమ ప్రభావాన్ని చూపించారు. ఈ క్రమంలో జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ కూటమి భారీ మెజారిటీతో గెలుపొందింది. బుధవారం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు,  మంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఇలాంటి సమయంలో ఒక ఆసక్తికర అంశం తాజాగా తెరమీదకు వచ్చింది.

అదేమిటంటే మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ అటు అల్లు అర్జున్ తో పాటు ఆయన భార్య అల్లు స్నేహారెడ్డిని కూడా సోషల్ మీడియాలో అన్ ఫాలో చేసినట్లుగా సమాచారం. ఆయన ట్విట్టర్,ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో వారిద్దరిని అన్ ఫాలో చేసినట్లు వెల్లడయ్యింది. అయితే  సాయిధరమ్ తేజ్‌ అల్లు  ఫ్యామిలీ నుంచి కేవలం అల్లు శిరీష్ ని మాత్రమే  ఫాలో అవుతున్నాడు. అయితే ధరమ్ తేజ్ కాకుండా మిగతా మెగా హీరోలందరూ అల్లు అర్జున్ ను ప్రస్తుతానికి ఫాలో అవుతూనే ఉండటం గమనార్హం.

Related Posts

Comments

spot_img

Recent Stories