మెగాస్టార్ చిరంజీవి త్వరలోనే ఓ పక్కా కామెడీ ఎంటర్టైనర్తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాకు డైరెక్టర్గా అనిల్ రావిపూడి బాధ్యతలు చేపట్టారు. నయనతార ఈ మూవీలో హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటివరకు ముస్సోరీలో రెండు షెడ్యూల్లు పూర్తయ్యాయి. తాజాగా హైదరాబాద్లో మూడవ షెడ్యూల్ను ప్రారంభించారు. ఇందులో చిరంజీవి, నయనతారలపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.
ఈ సినిమాకు సంబంధించి చిరంజీవి ఇటీవల స్పందిస్తూ, ఈ కథ తనకు బాగా నచ్చిందని తెలిపారు. అనిల్ రావిపూడి చెప్పే సన్నివేశాలు వింటేనే చాలా వినోదంగా ఉండటంతో, అవి మరింత ఎంటర్టైన్మెంట్గా ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించేలా ఉండబోతోందని ఆయన చెప్పిన సంగతి తెలిసిందే.
ఇక ఈ చిత్రంలో కేథరీన్ థెరీసా, మాస్టర్ రేవంత్ లాంటి వారు కూడా ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాను మెగాస్టార్ కుమార్తె సుస్మిత, సాహు గారపాటి కలిసి నిర్మిస్తున్నారు. అన్నీ కుదిరితే ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమా చిరంజీవి కెరీర్లో మరో మలుపుగా నిలవబోతుందని అభిమానులు ఆశిస్తున్నారు. కామెడీ, ఎమోషన్ మిక్స్తో రూపొందుతున్న ఈ సినిమా మీద ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి.