వేసవి కాలాన్ని ఎంజాయ్‌ చేస్తున్న మెగా కపుల్‌

టాలీవుడ్‌ అందమైన జంటల్లో చరణ్‌, ఉపాసన ల జంట ఒకటి. వీరిద్దరూ ఏ మాత్రం ఖాళీ దొరికిన విదేశాలకు ట్రిప్పులు వెళ్తుంటారు.
తాజాగా చరణ్‌ గేమ్ చేంజర్ షూటింగ్ కు గ్యాప్ రావడంతో ఒమన్ దేశానికి వెళ్లినట్లు సమచారం. ఉపాసన ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రామ్ చరణ్ గురించి ఏదోక విషయం  పోస్ట్ చేస్తుంది. తాజాగా ఒమన్‌ లో ఎంజాయ్‌ చేస్తున్న ఫోటోలను షేర్ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

తాజాగా చరణ్ – ఉపాసన క్లింకారా తో కలిసి ఒమన్ దేశానికి వెకేషన్‌ కి వెళ్లి ఎంజాయ్‌ చేస్తున్నారు. ఈ ట్రిప్పులో  ఉపాసన ఫ్యామిలీకి చెందిన జైదుస్ అనే కంపెనీ వర్క్ మీద వెళ్లినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో ఉపాసన కుటుంబానికి చెందిన వారు, బంధువులు కూడా వీరితో కలిసి ట్రిప్పులో సందడి చేశారు.  ఆ ఫోటోలను ఉపాసన సోషల్ మీడియాలో  అభిమానులతో పంచుకున్నారు. అవి ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Related Posts

Comments

spot_img

Recent Stories