వంశీపై ఇంకా బోలెడు కేసులు సిద్ధమవుతున్నాయ్!

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మీద ఇప్పటికే పలుకేసులు నమోదై ఉన్నాయి. అందులో కీలకమైన మూడు కేసుల్లో ఆయనకు బెయిలు వచ్చింది. అయినా ఆయన జైలునుంచి బయటకు మాత్రం ఇంకా రాలేదు. మూడో బెయిలు వచ్చిన రోజునే మరో కేసులో పీటీ వారంటు వేయడంతో ఆయన మళ్లీ జైలుకు వెళ్లారు. ఆ కేసులో కూడా బెయిలు రావొచ్చు గాక.. కానీ.. ఆయన మాత్రం బయటకు వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే.. గత అయిదేళ్ల కాలంలో ఆయన పాల్పడిన అనేకానేక అరాచకాలకు సంబంధించి.. ఇంకా పలుకేసులను, వాటికి పీటీవారంట్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఒక బెయిలు మంజూరయ్యేలోగా మరో కేసు తెరపైకి తెచ్చి పీటీవారంటు వేసి మళ్లీ జైలుకు పంపేలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.
వల్లభవనేని వంశీ- తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి, సత్యవర్దన్ కిడ్నాపు, స్థల ఆక్రమణ కేసుల్లో బెయిలు పొందారు. అయితే నకిలీ పట్టాలతో ప్రజలను మోసం చేసిన కేసులో ఇప్పుడు మళ్లీ రిమాండుకు వెళ్లారు. ఈ కేసులో బెయిలు కావాలని కోరుతూ ఆయన నూజివీడు కోర్టులో బెయిలు పిటిషన్ దాఖలు చేశారు. కేసు తీవ్రతను బట్టి బెయిలుపై నిర్ణయం ఉంటుంది. అయితే ఆయనకు బెయిలు మంజూరు కావడం అంటూ జరిగితే.. ఆ వెంటనే మరో కేసులో పీటీవారంటు వేయడానికి పోలీసులు కూడా సిద్ధంగానే ఉన్నారు.

అక్రమ మైనింగ్ కు పాల్పడిన కేసుకు సంబంధించి పోలీసులు పీటీవారంటు సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అక్రమమైనింగ్ అంటే ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించే వ్యవహారం కాబట్టి పోలీసులు ఏసీబీ కోర్టులోనే పీటీవారంటు దాఖలు చేయవచ్చునని తెలుస్తోంది. అదే జరిగితే.. నకిలీ పట్టాల కేసులో బెయిలు వచ్చే సమయానికి మళ్లీ మరొక రిమాండు జీవితం వల్లభనేని వంశీకి తప్పదు.

పోలీసులు ఇక్కడితో వంశీని వదిలేలా కూడా లేదు. ఒక కేసులో రిమాండుకు వెళ్లగానే.. ఆయన పాల్పడిన నేరాలకు సంబంధించి మరొక కేసును తెరపైకి తెస్తున్నారు. రిమాండు పూర్తయి బెయిలు లభిస్తుందనే సమయానికి ఆయా కేసుల్లో కూడా పీటీ వారంటు వేయడానికి సిద్ధం అవుతున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories