వాళ్లని ద్వేషించడం లేదు!

భైరవం అనే యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఈ వేసవి మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా రాబోతోంది. మే 30న విడుదలకు సిద్ధమైన ఈ సినిమాకు విజయ్ కనకమేడల దర్శకత్వం వహించగా, శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ పెద్ద స్థాయిలో నిర్మించారు. మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ లాంటి యువ హీరోలు ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

సినిమా రిలీజ్‌కు ముందు జోరుగా జరుగుతున్న ప్రమోషన్స్‌లో భాగంగా మంచు మనోజ్ తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాడు. తన కుమార్తెను తాను చేతిలో ఎత్తుకోవాలని ఉందని, ఆ క్షణాన్ని ఎదురుచూస్తున్నానని చెప్పాడు. ఇదే సమయంలో తల్లి నుంచి దూరమవడం వల్ల ఎదుర్కొంటున్న బాధను కూడా పంచుకున్నాడు.

తన జీవితంలోని తాజా పరిణామాలు తాను ఊహించనివి అని, తల్లిని కలిసే అవకాశం కోరుకోవాలల్సి వస్తోందని చెప్పాడు. తల్లిని కలవాలంటే ముందుగా అనుమతి తీసుకోవాలి లేకపోతే ఆమె బయటికి రావాల్సి ఉంటుంది అని అన్నారు. ఏ కొడుకు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోకూడదని మనోజ్ అన్నారు. తల్లీ కొడుకుల మధ్య దూరం ఎంత బాధ కలిగిస్తుందో చెప్పాడు.

ఇంత జరుగుతున్నా తాను ఎప్పుడూ ఆస్తి గురించి అడగలేదని, కానీ ఇప్పుడు తనపై వచ్చిన ఆరోపణలను తప్పుబట్టకుండా ఉండలేకపోతున్నానని వివరించాడు. తాను ఎప్పుడూ ద్వేషం తో ఉండకుండా ప్రేమతోనే చూసి వస్తున్నానని, జరుగుతున్న పరిణామాలు తనను బాధ పెడుతున్నాయని అన్నారు.

ఇలా వ్యక్తిగత జీవితంలోని భావోద్వేగాలను పంచుకుంటూ భైరవం సినిమా ప్రమోషన్స్‌లో మనోజ్ పాల్గొన్నారు. ఈ సినిమా ఫ్యాన్స్‌లో భారీ అంచనాలను నెలకొల్పింది, ఇప్పుడు ఈ సినిమాకు ఈ ఎమోషనల్ టచ్ మరింత హైప్ తీసుకురావడంలో సహాయపడుతోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories