టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్గా పేరున్న శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న తాజా చిత్రం ‘కుబేర’ పై సినీ ప్రేమికుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో ఒకవైపు స్టైల్కు బ్రాండ్ అయిన అక్కినేని నాగార్జున, మరోవైపు విలక్షణ నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్న ధనుష్ లీడ్ రోల్స్ లో కనిపించబోతుండటంతో సినిమా విషయంలో అంచనాలు చాలా ఎక్కువయ్యాయి. అలాగే గ్లామర్తో పాటు మంచి పెర్ఫార్మెన్స్ను చూపించే రష్మిక మందన్న కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది.
ఇప్పటికే షూటింగ్ దశలోనే విభిన్నమైన కాంబినేషన్, కంటెంట్పై ఫోకస్ పెరిగిపోవడంతో సినిమా చుట్టూ మంచి హైప్ క్రియేట్ అయింది. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కానుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ మీద స్పెషల్ ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో దీన్ని భారీగా ప్రెజెంట్ చేయాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు.
ఇదిలా ఉండగా, కేరళలో ఈ సినిమాకు మంచి ఆదరణ దక్కేలా అక్కడి ప్రముఖ నటుడు దుల్కర్ సల్మాన్ ప్రొడక్షన్ హౌజ్ ‘వేఫారర్ ఫిలింస్’ ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులు తీసుకుంది. దీనివల్ల మళయాళ మార్కెట్లో ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగే అవకాశముంది అని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.
ఇక మూవీకి సంబంధించి ట్రైలర్ను జూన్ 14న రిలీజ్ చేయబోతున్నారు. ఈ ట్రైలర్తో సినిమాపై ఉన్న బజ్ ఇంకాస్త పెరగనుంది అనే నమ్మకం మేకర్స్కి ఉంది. మొత్తానికి జూన్ 20న ఈ సినిమాను గ్రాండ్గా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి.