గులాబీ విషానికి నిమ్మల ఘాటైన కౌంటర్!

కాళేశ్వరం డ్యామ్ నిర్మాణం విషయంలో అప్పటి కేసీఆర్ సర్కారు ఎన్ని అక్రమాలకు పాల్పడింతో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం లెక్కతేల్చే పనిలో ఉంది. సాక్షాత్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా.. విచారణ కమిషన్  ముందు హాజరై వివరణలు ఇచ్చుకుంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో.. కాళేశ్వరంలో తమ పార్టీ నాయకులు పాల్పడిన అవినీతి గురించి ప్రజలు చర్చించుకోకుండా వారి ఆలోచనలను దారి మళ్లించడం భారాసకు తక్షణ అవసరం. అయితే అందుకోసం వారు అనుసరిస్తున్న మార్గమే అత్యంత అసహ్యంగా ఉంది.  కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదైనా లోపాలు గమనిస్తే నేరుగా వాటిమీద పోరాడాల్సింది బదులుగా.. ఏపీ ప్రభుత్వం గోదావరి నుంచి వృథాగా సముద్రంలోకి వెళుతున్న జలాలను వీలైనంత వరకు వినియోగించుకోవడానికి బనకచర్ల ప్రాజెక్టు సంకల్పిస్తోంటే దాని మీద విషం కక్కడం వారి కురచ బుద్ధులను బయటపెడుతోంది. అయితే ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రత్యేకంగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఏర్పాటుచేసి మరీ.. అసలు బనకచర్ల ద్వారా ఏం జరుగుతుందో.. భారాస వ్యక్తంచేస్తున్న ఆందోళన ఎంతటి అర్థరహితమైనదో వివరిస్తున్నారు.
ఏపీ చేస్తున్న ప్రయత్నం మీద విషం కక్కుతున్న గులాబీ దళాల కుట్ర ఆలోచనలకు నిమ్మల ఘాటైన కౌంటర్ ఇస్తున్నారు.  కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి విచారణను దారిమళ్లించేందుకే భారాస ఇలాంటి ఆరోపణలకు దిగుతోందన్న ఆయన మాటలు సహేతుకంగానే కనిపిస్తున్నాయి.పైగా నిమ్మల రామానాయుడు చాలా స్పష్టంగా.. దీనికి సంబంధించి అనుమతులన్నీ పొందిన తర్వాతనే.. తాము బనకచర్ల ప్రాజెక్టు నిర్మిస్తాం అని అంటున్నారు. తెలంగాణ ప్రాజెక్టులకు సీఎం చంద్రబాబు వ్యతిరేకం కానే కాదని, కానీ.. తెలంగాణకు కించిత్తు కూడా నష్టం కలిగించని విధంగా ఏపీ సర్కారు ప్లాన్ చేస్తున్న ప్రాజెక్టుల మీద కూడా వారు విషం కక్కుతుండడం దారుణం అని ఆయన వ్యాఖ్యానిస్తున్నారు.

మిగులు జలాల మీద సాధారణంగా దిగువ రాష్ట్రానికే పూర్తి హక్కులు ఉంటాయని నిమ్మల రామానాయుడు గుర్తుచేస్తున్నారు. నదుల అనుసంధానం చేసే ఉద్దేశంతో రాయల సీమకు సాగునీరు అందించే సంకల్పంతో ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేసినట్టు చెబుతున్నారు. అయితే.. తాను అధికారంలో ఉన్నంత కాలమూ తెలంగాణ సీఎం కేసీఆర్ కు కొమ్ము కాస్తూ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిన జగన్మోహన్ రెడ్డి.. పైకి తాను రాయలసీమ బిడ్డని అని చెప్పుకుంటున్నారే తప్ప.. రాయల సీమ వికాసానికి ఉపయోగపడే బనకచర్ల ప్రాజెక్టు విషయంలో తన అభిప్రాయాన్ని కూడా చెప్పకపోవడం.. భారాస కువిమర్శలను ఖండించకపోవడం ఆయన దుర్బుద్ధికి నిదర్శనం అని కూడా నిమ్మల రామానాయుడు చెబుతున్నారు. మొత్తానికి నిమ్మల మాటలు కేవలం గులాబీ దళం కక్కుతున్న విషానికి విరుగుడుగా మాత్రమే కాదు.. జగన్ దుర్బుద్ధిని కూడా ప్రజల ఎదుట నిరూపించే విధంగా ఉన్నాయని ప్రజలు అనుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories