లీకైన నాని సినిమా..ఆ బ్లాక్‌ బస్టర్ కథతో!

నేచురల్‌ స్టార్ నాని హీరోగా వివేక్‌ ఆత్రేయ డైరెక్షన్‌ లో వస్తున్న సినిమా సరిపోదా శనివారం. ఈ సినిమాలో నాని సరసన ఆడిపాడేందుకు యంగ్‌ హీరోయిన్‌ ప్రియాంక మోహన్ రెడీ అయ్యింది. ఇక నానికి విలన్ గా ఎస్‌జే సూర్య యాక్ట్‌ చేస్తున్నాడు. అదితి బాలన్, సాయికుమార్, మురళీ శర్మ, అజయ్ ఘోష్, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ వంటి టాలెంటెడ్ నటీనటులు నటిస్తున్న ఈ సినిమాని  డీవీవీ దానయ్య డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా ఆగస్టు 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కానీ ఇప్పటివరకు సినిమా మీద సరైన అంచనాలు లేవు..మూవీ టీమ్‌ కూడా ఎలాంటి బజ్‌ ని క్రియేట్‌ చేయలేదు.

తాజాగా ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టింది మూవీ టీమ్‌. అందులో భాగంగానే టీవీ ఛానెల్స్‌ కు  ఇంటర్వ్యూలు ఇవ్వడం కూడా మొదలుపెట్టారు.   ఈ సరిపోదా శనివారం అనే సినిమా లైన్ రజనీకాంత్ భాషా సినిమా లైన్ ని పోలి ఉంటుందని సమాచారం. నాని చిన్నప్పటినుంచి ఆవేశపరుడుగా ఉంటే అది ఎప్పటికైనా అనర్థమే అని భావించి నాని దగ్గర అతని తల్లి మాట తీసుకుంటుందట. పూర్తిగా గొడవలు జోలికి వెళ్లకుండా ఉండమంటే అది జరిగే పని కాదని తెలిసి వారంలో శనివారం మాత్రమే గొడవలకు వెళ్లాలని మిగతా రోజులు ఆవేశాన్ని కంట్రోల్ చేసుకునే ఉండాలని నాని దగ్గర నుంచి  మాట తీసుకుంటుందట. ఈ లైన్ ని బేస్ చేసుకుని మిగతా డ్రామా అంతా వివేక్ ఆత్రేయ రాసుకున్నాడని లైన్ విన్నప్పుడే తనకు సినిమా భలే నచ్చేసి వెంటనే చేస్తాను అని విలన్ గా చేస్తున్న సూర్య ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

ఇక ఈ సినిమా ఆగస్టు 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటివరకు ఆ డేట్ ని మరే పెద్ద సినిమాలు బ్లాక్ చేసుకోలేదు కాబట్టి నానికి ఈ సినిమా సోలో రిలీజ్ అని తెలుస్తుంది. నాని-వివేక్ ఆత్రేయ కాంబోలో వచ్చిన అంటే సుందరానికి అనే సినిమా పెద్దగా ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. కానీ ఈ సినిమా అయితే కనెక్ట్ అయ్యేట్లు ఉందని సమాచారం. ఈ సినిమాకి దాదాపు 150 కోట్లు బడ్జెట్ అయిందని నాని కెరియర్ లోనే ఇది అత్యధిక బడ్జెట్ సినిమా అని తెలుస్తుంది. ఈ సినిమాలో సోకుల పాలెం అనే ప్రాంతాన్ని ప్రత్యేకంగా సెట్ వేసి సృష్టించినట్లు కూడా చిత్ర బృందం చెప్పుకొచ్చింది.

Related Posts

Comments

spot_img

Recent Stories