ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘ది రాజాసాబ్’పై తెలుగు ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో ఉత్సాహం నెలకొంది. ఈ సినిమాను మారుతి దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. ఇదొక పూర్తి హారర్ కామెడీ సినిమా కావడంతో, ఈసారి ప్రభాస్ తన అభిమానులను భయపెట్టడమే కాకుండా నవ్వించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేపాయి.
ఈ సినిమా టీజర్ను జూన్ 16న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీంతో టీజర్కు ముందు వస్తున్న ప్రతి అప్డేట్పై ప్రేక్షకులు కన్నేసి ఉంచుతున్నారు. తాజాగా సినిమా సెట్లో దిగిన ఓ ఫోటోను చిత్ర బృందం షేర్ చేయగా అది మంచి హైప్ తెచ్చింది. ఆ ఫోటోలో ప్రభాస్తో పాటు దర్శకుడు మారుతి, సంగీత దర్శకుడు థమన్ నవ్వుతూ కనిపించడం విశేషం. సినిమా విడుదలకు ముందు ఆ జట్టులో కనిపించిన ఆ హుషారు, సినిమా మీద వారి నమ్మకాన్ని చెబుతోంది.
ఈ ప్రాజెక్ట్లో నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తుండగా, విలన్ పాత్రలో సంజయ్ దత్ కనిపించనున్నారు. ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ చిత్ర బృందం ప్రతీ అంశంలోనూ జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది.
టీజర్ ఎలా ఉండబోతుందో అన్న ఆసక్తి ఫ్యాన్స్లో ఎక్కువగా ఉంది. థ్రిల్, ఫన్ కలగలిపిన కొత్తగా తీర్చిదిద్దుతున్న ఈ సినిమా ప్రభాస్కి మరో హిట్ అందిస్తుందా అన్నది ఇప్పుడు చర్చగా మారింది.