“డబుల్ ఇస్మార్ట్” షూటింగ్ పై లేటెస్ట్ అప్డేట్‌!

తెలుగు చిత్ర పరిశ్రమ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ప్రధాన పాత్రలో, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ డబుల్ ఇస్మార్ట్. సూపర్ హిట్ అయిన ఇస్మార్ట్ శంకర్‌ కి ఈ సినిమా సీక్వెల్ గా రూపుదిద్దుకుంటుంది. కావ్యా థాపర్‌ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదలై అందరినీ ఆకట్టుకుంది.

ఈ చిత్రం ప్రస్తుతం ఇంకా షూటింగ్ దశలోనే ఉంది . లేటెస్ట్ సమాచారం ప్రకారం హైదరాబాద్‌లో రెండు పాటలు, గోవాలో మరొక పాటను చిత్రీకరించేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తుంది. ఈ పాటలు మినహా సినిమా మొత్తం షూటింగ్ కంప్లీట్‌ అయ్యింది. ఆగస్ట్ లేదా సెప్టెంబరులో సినిమాను విడుదల చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది.

బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఈ చిత్రంలో విలన్ పాత్ర లో కనిపిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. .

Related Posts

Comments

spot_img

Recent Stories