కోలీవుడ్లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో ఆర్య నటించిన సార్పట్ట పరంపర అనే బాక్సింగ్ నేపథ్య చిత్రానికి భారీ స్పందన వచ్చింది. దర్శకుడు పా.రంజిత్ ఈ సినిమాను విభిన్నంగా తెరకెక్కించారు. కరోనా సమయంలో థియేటర్లు మూసి ఉండటంతో, ఈ సినిమా నేరుగా ఓటిటీలో విడుదల అయ్యింది. అయినప్పటికీ, ప్రేక్షకుల నుండి వచ్చిన రెస్పాన్స్ మాత్రం థియేటర్ హిట్కు ఏమాత్రం తగ్గలేదు.
ఈ సినిమాలో ఆర్య పోషించిన పాత్ర, 1970ల కాలంలో సెట్ అయిన బ్యాక్డ్రాప్, బాక్సింగ్ ప్రాముఖ్యత వంటి అంశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకు కొనసాగింపు వస్తుందన్న విషయం అప్పటినుంచే ఫ్యాన్స్లో ఆసక్తిని పెంచింది.
ఇప్పటికే తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకుల్లోనూ ఈ సీక్వెల్ను ఆసక్తిగా ఎదురుచూస్తున్న వాళ్లు ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం, ఈ రెండో భాగం ఆగస్ట్ నుంచి షూటింగ్ ప్రారంభించే అవకాశం ఉందని చెబుతున్నారు. అంటే చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్ ఎట్టకేలకు పట్టాలెక్కబోతుందన్న మాట.
ఇంకా సినిమాకు సంబంధించి మిగతా వివరాలు త్వరలో వెలుగులోకి రానున్నాయి. అయితే సార్పట్ట పరంపర సీక్వెల్ పనులు మొదలవుతున్నాయన్న వార్త ఒక్కటే అభిమానులను ఫుల్ హ్యాపీగా చేస్తుంది.