సెన్సార్‌ పూర్తి చేసుకున్న కుబేర!

కోలీవుడ్ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా వంటి టాప్ స్టార్స్ కలిసి నటించిన సినిమా ‘కుబేర’ గురించి ఇప్పుడు మంచి హైప్ కొనసాగుతోంది. మ్యూజికల్ ఎమోషనల్ డ్రామాలకి పేరున్న శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే ట్రైలర్‌తో అంచనాలు పెంచేసింది.

ఇక ఈ సినిమాను భారీ నిడివితో థియేటర్లకు తీసుకురానున్నారనే మాట చాలాసార్లు వినిపించింది. మొదట 3 గంటల 15 నిమిషాల నిడివి ఉంటుంది అన్న టాక్ వచ్చినా.. ఆ తరువాత ఓ క్లారిటీ రానివ్వలేదు. అయితే తాజాగా కుబేర మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

సెన్సార్ బోర్డు ఈ సినిమాకి యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. అంతేకాదు, అసలు సినిమాకి ఫైనల్‌గా ఎంత నిడివి ఉండబోతోందో కూడా స్పష్టత వచ్చింది. మొత్తంగా కుబేర రన్ టైమ్ 3 గంటల 1 నిమిషంగా ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. అంటే ఈ సినిమా ఒక్కసారి మొదలైతే చాలాసేపు ప్రేక్షకులను థియేటర్ సీట్లో కూర్చోబెడితే తప్పదు.

ఈ భారీ ప్రాజెక్టుకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, అమిగోస్ సినిమాస్ మరియు శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి సంస్థలు కలిసి నిర్మాణ బాధ్యతలు చేపట్టాయి. ఇక ఈ సినిమా ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే జూన్ 20వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే.

Related Posts

Comments

spot_img

Recent Stories