సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, అనుష్క శెట్టి కథానాయికగా నటించిన “ఖలేజా” సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన రెండో చిత్రమే. ఈ సినిమా విడుదలై చాలా ఏళ్లైంది కానీ తాజాగా ఈ మూవీ మళ్లీ ప్రేక్షకుల ముందుకు రీరిలీజ్ అయ్యింది. ఈ రీలీజ్లో పెద్ద క్రేజ్ సృష్టించింది ఖలేజా. ఈ క్రేజ్ కేవలం ఇండియాలోనే కాకుండా అనకాపల్లిలో నుండి అమెరికా వరకు కూడా కనిపిస్తుంది. అమెరికా మార్కెట్లో ఈ సినిమా అందించిన వసూళ్లు ఆశ్చర్యానికి కారణమయ్యాయి.
యూఎస్ లో ఈ సినిమా విడుదలై అంచనాలకు మించి 80 వేల డాలర్లకు పైగా వసూలు చేసినట్లు సమాచారం. ఇది అక్కడి టాప్ రికార్డుల లో ఒకటిగా నిలిచింది. మొత్తానికి, ఖలేజా సినిమా ఇన్నాళ్లకూ ఒక పెద్ద సక్సెస్గా మారిపోయింది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. నిర్మాణ బాధ్యత సి కళ్యాణ్, సింగనమల రమేష్ బాబు వహించారు.