ఉత్తమ చిత్రం గా కార్తీకేయ 2!

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కెరీర్‌లో ‘కార్తీకేయ-2’ ఎలాంటి సక్సెస్ అందుకుందో అందరికీ తెలిసిన విషయమే. పాన్ ఇండియా సినిమాగా ఈ మూవీ రావడంతో పాటు దర్శకుడు చందు మొండేటి ఈ సినిమాను తెరకెక్కించిన తీరు ఎంతో అద్బుతంగా ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమాకు మంచి విజయాన్ని అందించారు. తాజాగా ఈ  సినిమా ఓ అరుదైన ఘనతను అందుకుంది.

కేంద్ర ప్రభుత్వంచే 70వ జాతీయ ఫిలిం అవార్డుల్లో 2022 సంవత్సరానికి గాను ఉత్తమ తెలుగు చిత్రంగా ‘కార్తికేయ-2’ నిలిచింది. శ్రీకృష్ణుడి ఇతివృత్తంతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ వసూళ్లు రాబట్టింది. దీనికి తోడు ఈ సినిమాలోని నటీనటుల పర్ఫార్మెన్స్, చక్కటి సంగీతం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. నార్త్‌లోనూ ఈ సినిమా సూపర్ సక్సెస్‌గా నిలిచి రికార్డులు క్రియేట్ చేసింది.

ఇక ఈ సినిమాను చందు మొండేటి డైరెక్ట్ చేయగా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్‌తో పాటు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి.విశ్వ ప్రసాద్‌లు సంయుక్తంగా నిర్మించారు.

Related Posts

Comments

spot_img

Recent Stories