ఆ డైరెక్టర్‌ కి ఓకే చెప్పిన కల్యాణ్‌ రామ్‌!

నందమూరి కళ్యాణ్ రామ్ ప్రస్తుతం తన కెరీర్‌లోని 21వ చిత్రాన్ని చిత్రీకరిస్తూ ఫుల్‌ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను దర్శకుడు ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేస్తుండగా, పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటుంది. ఇక ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరికొత్త పాత్రలో కనిపిస్తాడని మూవీమేకర్స్ చెబుతున్నారు. కాగా, ఈ సినిమాలో లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి ఓ కీలక పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు క్రియేట్ అయ్యాయి.

ఇక ఈ సినిమా తరువాత కళ్యాణ్ రామ్ తన నెక్స్ట్ సినిమాను కూడా ఓకే చేసినట్లుగా సినీ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్‌లో కుమారి 21F, 18 పేజీస్ వంటి హిట్ చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్, నందమూరి కళ్యాణ్ రామ్‌కి ఓ కథను వినిపించాడట. ఈ కథ నచ్చిన కళ్యాణ్ రామ్ సూర్య ప్రతాప్‌తో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఈ సినిమాను త్వరలోనే పట్టాలకెక్కించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తుందని వార్తలు వస్తున్నాయి. మరి సుకుమార్ శిష్యుడైన సూర్య ప్రతాప్ తెరకెక్కించే సినిమాను సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ కో-ప్రొడ్యూస్ చేస్తుందా లేదా అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్‌!

Related Posts

Comments

spot_img

Recent Stories