సంక్రాంతికి కలుద్దామంటునన క్రేజీ కాంబో!

టాలీవుడ్ లో తెర‌కెక్కుతున్న ప్రాజెక్టుల్లో విక్ట‌రీ వెంక‌టేశ్, ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి కాంబో లో రాబోతున్న క్రేజీ మూవీ కూడా ఒక‌టి. గ‌తంలో వీరిద్ద‌రి కాంబోలో వచ్చిన ‘ఎఫ్‌-2’, ‘ఎఫ్-3’ చిత్రాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్స్ గా నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు మరోసారి వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో రాబోతున్న మూడో చిత్రం కచ్చితంగా హ్యాట్రిక్ విజ‌యాన్ని అందుకోవ‌డం గ్యారంటీ అని అంద‌రూ అనుకుంటున్నారు.

అయితే, ఈ ప్రాజెక్టుకు సంబంధించి సినీ స‌ర్కిల్స్ లో ఓ క్రేజీ సమాచారం విన‌బ‌డుతోంది. అనిల్ రావిపూడి, వెంక‌టేశ్ కాంబో లో రాబోతున్న ఈ సినిమాకు ఓ ఆస‌క్తిక‌ర టైటిల్ ను ఫిక్స్ చేయ‌బోతున్నార‌ని సమాచారం. పూర్తి ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ గా రాబోతున్న ఈ సినిమాకు ”సంక్రాంతికి క‌లుద్దాం” అనే టైటిల్ ను ఫిక్స్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఫ్యామిలీ ఆడియెన్స్ కు బాగా క‌నెక్ట్ అయ్యేలా ఈ టైటిల్ ఉంటుంద‌ని మూవీ మేక‌ర్స్ భావిస్తున్నార‌ట‌.

దీంతో వెంక‌టేశ్ నుంచి మ‌రోసారి కుటుంబ క‌థా చిత్రం రాబోతుంద‌ని అభిమానులు ఫిక్స్ అయ్యారు. ఇక ఈ సినిమాలో అందాల భామ‌లు మీనాక్షి చౌద‌రి, ఐశ్వ‌ర్య రాజేష్ లు హీరోయిన్లుగా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను సంక్రాంతి బ‌రిలో విడుదల చేయాల‌ని చిత్ర బృందం ప్లాన్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.

Related Posts

Comments

spot_img

Recent Stories