హైదరాబాద్ దగ్గరే ఉన్న రామోజీ ఫిలిం సిటీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇండియన్ సినిమా పరిశ్రమలో దాదాపు ప్రతి దర్శక నిర్మాతకూ ఈ ఫిలిం సిటీకి రావడం ఒక డ్రీమ్ లా ఉంటుంది. మోడ్రన్ ఫెసిలిటీస్, బిగ్ స్పేస్, ప్రతి ఒక్కదీ షూటింగ్స్కు అద్భుతంగా ఉంటుంది కాబట్టే ఇది ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. కానీ ఇటీవల బాలీవుడ్ నటి కాజోల్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఈ ఫిలిం సిటీపై ఓ నెగెటివ్ డిబేట్కు దారితీశాయి.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో కాజోల్ మాట్లాడుతూ రామోజీ ఫిలిం సిటీలో రాత్రివేళలు గడపడం తనకు కొంత భయంగా అనిపించేదని చెప్పింది. అక్కడ కొన్ని భయంకరమైన అనుభూతులు తాను ఫీలయ్యానని ఆమె అభిప్రాయపడింది. అయితే ఆమె వ్యాఖ్యలు బయటకు రావడంతో టాలీవుడ్ అభిమానులే కాకుండా సినీ రంగంలో ఉన్న కొంతమంది కూడా కాజోల్ వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేశారు.
ఎందుకంటే ఇప్పటివరకు చాలామంది హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు, టెక్నీషియన్లు రామోజీలో నానెన్నేళ్లుగా షూటింగ్లు చేస్తున్నారు. కానీ ఎవ్వరూ ఇలాంటి అనుభవాల గురించి ప్రస్తావించలేదు. పైగా రామోజీ ఫిలిం సిటీ టూరిజం కోణంలోను ఎంతో పాపులర్. టూరిస్టులు ఫ్యామిలీస్తో వచ్చి ఎంజాయ్ చేసే పేస్ ఇది. అందుకే కాజోల్ కామెంట్స్ని చాలా మంది తప్పుబట్టారు.
ఈ విమర్శలపై స్పందించిన కాజోల్ తాజాగా క్లారిటీ ఇచ్చింది. తాను చెప్పిన మాటలు కొత్తగా వస్తున్న తన మూవీ ప్రమోషన్స్లో భాగంగా అనేవి తప్ప వాస్తవాన్ని వక్రీకరించే ఉద్దేశం తనకు లేదని చెప్పింది. అంతేకాదు, రామోజీలో తాను గతంలో చాలా షూటింగ్స్ చేసింది, అక్కడి వర్కింగ్ ఎన్విరాన్మెంట్ చాలా ప్రొఫెషనల్గా ఉంటుందని వివరించింది. టూరిస్టులకే కాకుండా ఫ్యామిలీలు, పిల్లలు కూడా అక్కడ ఉండటానికి పూర్తి కంఫర్ట్గా ఫీల్ అవుతారని చెప్పింది.
కాజోల్ స్పష్టత ఇవ్వడంతో కొంత వరకూ వివాదం తగ్గినప్పటికీ, ఆమె మొదట్లో చేసిన వ్యాఖ్యలు మాత్రం ఫిలిం ఇండస్ట్రీలో కొంతకాలం చర్చకు దారితీశాయి.