విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న తాజా పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘కింగ్డమ్’పై ప్రేక్షకుల్లో భారీగా ఆసక్తి నెలకొంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ గురించి ఇప్పటికే సోషల్ మీడియాలో చర్చలు ఊపందుకున్నాయి. విజయ్ గత ప్రాజెక్ట్ల తర్వాత ఈ సినిమాపై అభిమానుల ఆశలు మరింత పెరిగిపోయాయి.
ఇక సినిమాకు సంబంధించి రీసెంట్గా వస్తున్న రూమర్స్పై క్లారిటీ ఇవ్వడమే కాకుండా, కొన్ని తప్పుడు వార్తలకు బ్రేక్ వేసింది చిత్రబృందం. షూటింగ్ విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేవని, రీషూట్ అనేది జరగలేదని మేకర్స్ స్పష్టంగా తెలియజేశారు. అనుకున్న తేదీకే సినిమా థియేటర్లలోకి రాబోతుందని చెప్పారు. ప్రస్తుత పరిస్థితి తుఫాన్ ముందు నిశ్శబ్దంలా ఉందని వారు అభిప్రాయపడ్డారు.
ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా, సంగీతాన్ని అనిరుధ్ రవిచందర్ అందిస్తున్నారు. ఇక నిర్మాణ బాధ్యతలు సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య చేపట్టారు. మొత్తానికి ‘కింగ్డమ్’పై ఎలాంటి అపోహలు లేకుండా, సినిమాపై బజ్ కొనసాగుతుండటం మేకర్స్కి పాజిటివ్ అంశంగా మారింది.