జూనియర్‌ ఎన్టీఆర్‌ కోటి విరాళం!

మ్యాన్‌ మాఫ్‌ మాసెస్‌ ఎన్టీఆర్‌ మరోసారి తన మంచి మనసును చాటుకున్నాడు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో పలు ప్రాంతాల్లో భారీ వరదలు ముంచెత్తాయి. దీంతో తెలుగు సినిమా నుంచి ప్రముఖులు విరాళాలు అందించడం కూడా మొదలు పెట్టారు. తాజాగా జూనియర్‌ ఎన్టీఆర్ తన వంతుగా రెండు రాష్ట్రాలకు కలిపి కోటి రూపాయలు ఆర్ధిక సాయాన్ని అందించాడు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో వరదల ముప్పు తనని ఎంతగానో కలచివేసింది. అందుకే రెండు తెలుగు రాష్ట్రాలకి చేరో 50 లక్షల రూపాయలు విరాళంగా తెలంగాణ, ఏపీ ప్రభుత్వ సహాయ నిధులకి అందిస్తున్నాను అని ట్విట్టర్ ఖాతాలో తెలియజేశాడు. దీంతో తారక్ మరోసారి తన ఉదారతను చాటుకున్నాడు అని అభిమానులు కొనియాడుతున్నారు. ఇక తన దేవర నుంచి రేపు మూడో సాంగ్ రిలీజ్ కి రాబోతుండగా ఈ సెప్టెంబర్ 27న సినిమా గ్రాండ్ గా విడుదల కాబోతుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories