జక్కన్న ఫ్యామిలీకి తప్పిన పెను ప్రమాదం!

టాలీవుడ్‌ దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కుటుంబానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ప్రస్తుతం రాజమౌళి ఫ్యామిలీ జపాన్‌ పర్యటనలో ఉన్నారు. అక్కడ భూకంపం బారి నుంచి బయటపడ్డారు. ఈ విషయాన్ని జక్కన్న కుమారుడు సోషల్‌ మీడియా వేదికగా తెలియజేశాడు.

జపాన్‌ లో 28 వ అంతస్తులో ఉండగా భూమి కంపించిందని మేము చాలా ఆందోళనకు గురయ్యామని కార్తీకేయ వివరించాడు. తాము 28 వ అంతస్తులో ఉండగా భూమి కంపించింది. అది భూకంపం అని తెలుసుకోవడానికి మాకు కొంత సమయం పట్టింది. నేను చాలా భయాందోళనకు గురయ్యా. కానీ…మా చుట్టూ ఉన్న జపనీయులందరూ కూడా ఎలాంటి ఆందోళన చెందకుండా వారికి ఏదో వర్షం పడుతున్నట్లు ఈజీగా తీసుకున్నారు. మొత్తానికి మేం భూకంపాన్ని ఎక్స్‌పీరియెన్ష్‌ చేశాం” అంటూ రాసుకొచ్చాడు.

కార్తీకేయ భూకంపం సమయంలో తన స్మార్ట్‌ వాచ్‌ లో వచ్చిన వార్నింగ్‌ ని ఫొటో తీసి ట్విట్టర్ లో షేర్‌ చేశాడు. ఈ విషయం గురించి తెలుసుకున్న అభిమానులు రాజమౌళి ఫ్యామిలీ క్షేమంగా ఇండియాకి తిరిగి రావాలని కోరుకుంటున్నారు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా స్పెషల్‌ స్క్రీనింగ్‌ కోసం రాజమౌళి కుటుంబం జపాన్‌ కు వెళ్లారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories