వృద్ధుడిని పొట్టన పెట్టుకున్న జగన్ అత్యుత్సాహం!

పోలీసులు ఏది వద్దంటే తాను అదే చేయాలి! పోలీసులు తనని అడ్డుకోవాలి. తాను చేస్తున్న పని మొత్తం రచ్చ రచ్చ అయిపోవాలి. అప్పుడు ప్రజల ఎదుటకు వచ్చి.. ‘‘నాకు భ్రదత ఇవ్వడ లేదు.. నన్ను చంపేయడానికి కుట్రలు చేస్తున్నారు.. నన్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయండి’’ అంటూ బూటకపు విలాపాలు ఏడవాలి. ఏ పనిచేసినా సరే.. దాని వెనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న సింగిల్ పాయింట్ ఎజెండా ఇదే! సత్తెనపల్లి వద్ద రెంటపాళ్లలో మరణించిన తమ పార్టీ కార్యకర్త నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరిస్తానని, ఆయన కుటుంబాన్ని పరామర్శిస్తానని ఒక డ్రామా యాత్ర పెట్టుకున్న జగన్.. ఏకంగా ఒక వృద్ధుడి ప్రాణాన్ని బలి తీసుకున్నారు. కేవలం పోలీసుల ఆంక్షలను అతిక్రమించాలనే దురుద్దేశంతో.. భారీ సంఖ్యలో వాహనాలను తన కాన్వాయ్  వెంట తీసుకువెళ్లారు జగన్మోహన్ రెడ్డి. ఆయన కాన్వాయ్ వెంట ఉన్న వైసీపీ నాయకుల వాహనాల్లో ఒక కారు ఢీకొని గుంటూరులో ఒక వృద్ధుడు దుర్మరణం పాలయ్యాడు. ఈపాపం అచ్చంగా జగన్మోహన్ రెడ్డి అత్యుత్సాహానిదే అని, ఇది జగన్ చేసిన హత్య అని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.

జగన్ పబ్లిక్ కార్యక్రమాలు అనౌన్స్ చేస్తున్న సమయంలో నాయకులు మితిమీరి తరలిస్తున్న జనం.. విచ్చలవిడిగా ప్రవర్తిస్తుండడంతో అవాంఛనీయ సంఘటనలు జరగుతూ వచ్చాయి. దీంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకనున్న పోలీసులు కొన్ని ఆంక్షలు విధించారు. అది కేవలం పరామర్శ యాత్ర అంటున్నారు గనుక.. జగన్ కాన్వాయ్ కాకుండా అదనంగా మూడు కార్లు ఉండవచ్చునని, కార్యక్ర మం వద్ద వందమంది జనం మించకూడదని అన్నారు. కేవలం ఇరుకు వీధి కావడం వల్ల మాత్రమే జనానికి ఆంక్షలు పెట్టారు. గ్రామ శివార్లలో సభ పెట్టుకుంటే ఎంత మంది వచ్చినా అనుమతిస్తామని అన్నారు. అయితే.. వైఎస్ జగన్ మాత్రం..  వందల వాహనాలతో భారీ ర్యాలీగా ఇంటినుంచి బయల్దేరి ఆర్భాటం ప్రదర్శించారు. గుంటూరు జిల్లా ఏటుకూరు సమీపంలో లాప్ పురం హైవే వద్ద జగన్ కాన్వాయ్ వెంట వస్తున్న నాయకుల వాహనం ఢీకొని ఒక వృద్ధుడు మరణించాడు.
వాహనం ఢీకొనడంతో వృద్ధుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. బాధితుడిని వైసీపీ కార్యకర్తలు రోడ్డు పక్కనే పడేసి వెళ్లిపోయారు. స్థానికులు స్పందించి అతడిని గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినప్పటికీ.. ప్రయోజనం దక్కలేదు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వృద్ధుడు మరణించాడు. వృద్ధుడికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

అయితే ఇలాంటి దుర్ఘటన ఎందుకు జరిగినట్టు? పోలీసులు తక్కువ వాహనాలతో వెళ్లాలని చెప్పినప్పటికీ.. పట్టించుకోకుండా జగన్ అతి చేయడం వల్ల మాత్రమే ప్రమాదం జరిగిందని ప్రజలు అంటున్నారు. ఇలాంటి దుర్మార్గపు బుద్ధులను జగన్ మార్చుకోవాలని ప్రజలు అంటున్నారు. ప్రజల ప్రాణాలను, కార్యకర్తల ప్రాణాలను పణంగా పెడుతూ.. వారు చచ్చినా  పర్లేదన్నట్టుగా జగన్ తన యాత్రలు నిర్వహిస్తున్నారని.. తన భజన పరులతో కిరాయి మూకలతో ‘సీఎం సీఎం’ అంటూ నినాదాలు చేయించుకుని మురిసిపోవడం తప్ప.. ప్రజల ప్రాణాలకు జగన్ దృష్టిలో విలువ లేదని ఈ దృష్టాంతం నిరూపిస్తున్నదని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories