జగన్.. వడ్డీతో సహా మింగినదంతా కక్కాలేమో!

‘వడ్డీతో సహా’ అనే పదం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒక ఫ్యాషన్ అయిపోయినట్టుగా కనిపిస్తోంది. చీటికీ మాటికీ వడ్డీతో సహా ఇస్తాం అనేది వాళ్లు ఒక నినాదంలాగా మార్చుకుంటున్నారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం- గతంలో జరిగిన అక్రమాల మీద దృష్టి సారిస్తే చాలు.. వారి మీద కేసులు పెడితే చాలు.. కేసులు తేలి కోర్టులో శిక్ష పడినా సరే అదంతా అధికార పార్టీ కుట్ర అన్నట్టుగా బిల్డప్ ఇస్తూ ‘వడ్డీతో సహా ఇస్తాం’ అని అనడం వాళ్లు అలవాటు చేసుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్ కూడా అలాగే వ్యవహరిస్తున్నారు. కొన్ని ప్రాంతాల నుంచి పిలిపించుకున్న నాయకులతో తాడేపల్లిలో సమావేశం అయిన జగన్మోహన్ రెడ్డి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే.. వడ్డీతో సహా రిటర్న్ గిఫ్ట్ లు ఇస్తాం అని అంటున్నారు. ఇది రొటీన్ బెదిరింపే గానీ.. పదేపదే ఈ మాట ఆయన నోట వింటున్న వారు మాత్రం.. జగన్ 2.0 పాలన మొదలు కావడానికి ముందే.. ఆయన అధికారంలో ఉన్నప్పుడు మింగినదంతా వడ్డీతో సహా కట్టాల్సి వస్తుందేమో అని అంటున్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రోజుల్లో ఆ పార్టీ నాయకులందరూ ఎవరి లెవెల్లో వారు విచ్చలవిడి అవినీతికి పాల్పడ్డారు. కోట్లకు కోట్లరూపాయలు అక్రమమార్గాల్లో ప్రజాధనాన్ని, ప్రభుత్వధనాన్ని కాజేశారు. కబ్జాలు చేశారు. ప్రభుత్వ, ప్రెవేటు, అటవీ, మఠాల భూములను ఎలా పడితే అలా ఆక్రమించుకున్నారు. దోచుకున్నారు. ప్రజలు ఒక్కఛాన్స్ ఇచ్చినందుకు.. వారికి తాయిలాలు అందించే బూటకపు పాలన సాగిస్తే.. ఎప్పటికీ తనకు దాసుల్లా పడిఉండి ఓట్లు వేస్తూనే ఉంటారని కలగన్నారు జగన్!

చేసిన పాపాలన్నీ ఊరికే పోవు కదా.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే.. ప్రజలకు కూడా ధైర్యం వచ్చింది. తమను ఏ రకంగా దోచుకున్నారో, వేధించారో ఇప్పుడు కేసులు పెడుతున్నారు. వారి అక్రమాల మీద ప్రభుత్వం కూడా దృష్టి సారించి అవినీతిని లెక్కతేల్చుతోంది. ఫరెగ్జాంపుల్.. మూడున్నర వేల కోట్ల రూపాయల ప్రజాధనం కాజేసినట్టుగా కేసులు నడుస్తున్న లిక్కర్ కుంభకోణంలో.. జగన్ దళాలు దాదాపు వెయ్యి కోట్ల రూపాయల మేర బంగారం రూపంలోకి మార్చి మరీ దోచుకున్నాయి. ఆ బంగారం విలువ అప్పటికీ ఇప్పటికీ దాదాపు రెట్టింపు అయి రెండు వేల కోట్లరూపాయల వరకు చేరి ఉంటుందని అంచనా. దోచుకున్న సొమ్మునంతా డొల్ల కంపెనీలతో వైట్ మనీగా మార్పించాయి. అంటే వడ్డీలకంటె మిక్కిలిగా గిట్టుబాటు కాగలిగే విధంగా.. దోచుకున్నారన్నమాట. మరి ఇప్పుడు ఆ పాపాలు తేలుతున్న సమయంలో.. వడ్డీతో సహా తిరిగి ప్రభుత్వానికి కట్టాల్సిందే కదా అని ప్రజలు జోకులు వేసుకుంటున్నారు.

జగన్ 2.0 తర్వాత.. తెలుగుదేశం వారిని వడ్డీతో సహా వేధించే సంగతి తర్వాత.. ముందు.. చంద్రబాబు 4.0 ముగిసేలోగా జగన్.. తాను మింగిన అవినీతి సొమ్ము మొత్తం వడ్డీతో సహా కక్కాల్సి ఉంటుందని అనుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories