ఇదేం నీతి? నిబంధనలు తమరు పెట్టినవే కదా?

సంక్షేమం అంటే జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా.. ఆయన అత్యద్భుతమైన పథకాలు అమలు చేసేశారంటూ.. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రజలు వారిని దారుణంగా తిరస్కరించిన ఏడాది తర్వాత కూడా సొంత డప్పు కొట్టుకుంటూ ఉంటుంది. ఇప్పుడు అవే సంక్షేమ పథకాలను మరింత మెరుగైన రీతిలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తోంది. మరింత ఎక్కువ మొత్తాలను లబ్ధిదారులకు అందిస్తోంది. అయితే.. నిబంధనల విషయానికి వస్తే.. గతంలో ప్రభుత్వం అమలు చేసిన నిబంధనలే వర్తిస్తాయని తేటతెల్లం చేస్తోంది. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం.. నిబంధనల విషయంలో  గత ప్రభుత్వం విధించిన వాటినే అనుసరిస్తోంది. అయితే.. వాటి గురించి వైఎస్సార్ కాంగ్రెస్ నానాయాగీ చేస్తుండడం గమనార్హం.

తల్లికి వందనం సహా ఇతర ప్రభుత్వ సంక్షేమపథకాలు పుచ్చుకునే వారికి నెలకు రూ.300 యూనిట్లకు మించకుండా..  విద్యుత్తు వాడకం ఉండాలనేది ఒక నిబంధన. అయితే ఇందుకు గత పన్నెండు నెలల మీటర్ రీడింగును పరిశీలించి సగటు లెక్కిస్తారు. ఇది గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన నిబంధనే. అప్పట్లో వేసవిలో విద్యుత్తు వినియోగం ఒక్క నెల అయినా సరే.. 300 యూనిట్లు దాటితే చాలు.. వెంటనే పింఛను ఆపేసేవారు. ఇప్పుడు నిబంధన ప్రకారమే వ్యవహరిస్తున్నారు.

అయితే ఇలాంటి నిబంధనలు పెట్టడమే తప్పు అన్నట్టుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం సాగిస్తున్నది. నెలకు 300 యూనిట్ల విద్యుత్తు వినియోగం అంటే చాలా భారీ వినియోగం కింద లెక్క. ఒక టూబెడ్ రూం ఇంటిలో ఫ్రిజ్, వాషింగ్ మెషిన్, గీజర్, ఒవెన్, ఎలక్ట్రిక్ కుక్కర్ వంటి ఆధునిక విద్యుత్తు ఉపకరణాలన్నీ ఉన్నా కూడా వాటిని విరివిగా వాడినా కూడా విద్యుత్తు వాడకం 150-200 యూనిట్లు మాత్రమే ఉంటుంది. కేవలం ఏసీ కూడా ఉంటూ, దానిని విరివిగా వాడుతుంటే మాత్రమే వినియోగం 300 యూనిట్లు దాటుతుంది. ఇది ఖచ్చితంగా ఎగువ మధ్యతరగతి వర్గానికి చెందిన వారికి మాత్రమే సాధ్యం. మధ్యతరగతి కరెంటు వినియోగం ఎన్నడూ 300 యూనిట్లు దాటదు. పైగా ఇది కూటమి ప్రభుత్వం విధించిన నిబంధన ఎంతమాత్రమూ కాదు.
ఇలాంటి సమయంలో.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం.. అక్కడికేదో లబ్ధిదారులకు అన్యాయం జరిగిపోతున్నట్టుగా మొసలి కన్నీరు కారుస్తుండడం గమనార్హం.

తమకు సొంత టీవీ ఛానెల్, సొంత పత్రిక ఉన్నాయి గనుక.. ఎలాంటి తప్పుడు రాతలు రాస్తూ అయినా చెలామణీ అయిపోవచ్చునని.. ఎలాంటి తప్పుడు నిందలు అయినా ప్రభుత్వం మీద వేయవచ్చునని వైఎస్సార్ కాంగ్రెస్ దళాలు తలపోస్తుండవచ్చు గాక!  కానీ వాస్తవానికి వస్తే.. ఆ నీలి మీడియా తప్పుడు ప్రచారాలను చూసేవాళ్లు కూడా జగన్ భక్తులు మాత్రమే! వాళ్లు ఎంతగా తప్పుడు ప్రచారాలు చేసినా ప్రజలకు వాస్తవాలు తెలుసు కదా అనేది విశ్లేషకుల మాటగా ఉంటోంది. గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పాలనలో ఇవే నిబంధనలను ఇంతకంటె కఠినంగా అమలు చేసి పింఛనుదార్లను ఏరివేసిన వైనం ప్రజలు గుర్తుచేస్తున్నారు.  ఆ పార్టీ పెట్టిన నిబంధనలనే కొత్త ప్రభుత్వం కూడా అమలు చేస్తుండగా.. ఇప్పుడు మాత్రం సాగిస్తున్న కుటిల ప్రచారాన్ని ప్రజలు తిప్పికొడుతున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories