శైలేష్‌ కొలను డైరెక్షన్‌ లో గ్లోబల్‌ స్టార్‌?

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ తాజాగా నటిస్తున్న చిత్రం గేమ్‌ ఛేంజర్‌. ఈ సినిమాలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుంది.  ఈ సినిమాలో మరో క్యూట్ బ్యూటీ అంజలి కూడా నటిస్తుంది. అంతేకాకుండా ఈ సినిమాలో సునీల్‌, నవీన్‌ చంద్ర, ఎస్‌జే సూర్య, సముద్ర ఖని వంటి వారు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

అసలు ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైనప్పటికీ దర్శకుడు శంకర్‌ ఇండియన్‌ 2 సినిమాతో బిజీగా ఉండడంతో గేమ్‌ ఛేంజర్‌ సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది. ఈ క్రమంలోనే ఇండియన్ 2 సినిమా విడుదలకు రెడీ అవ్వటంతో శంకర్ గేమ్ ఛేంజర్ సినిమాపై ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. మొన్నటి వరకు ఈ సినిమా షూటింగ్ రాజమండ్రి పరిసర ప్రాంతాలలో జరుగగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వైజాగ్ లో జరుగుతుంది.

ఇదిలా ఉంటే, ఈ మూవీని శంకర్ కాకుండా తెలుగు దర్శకుడు శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తున్నారని గతంలో కొన్ని వార్తలు బయటకు వచ్చాయి. ఈ వార్తలు గురించి శైలేష్ ని అడగగా.. తాను డైరెక్ట్ చేసిన మాట నిజమే అని, కానీ అవి అంత ఇంపార్టెంట్ సీన్స్ కాదని,  శంకర్ ఇండియన్ 2 షూటింగ్ లో బిజీగా ఉండడంతో తాను ఆ సీన్స్ చేయాల్సి వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు శంకర్ గేమ్ ఛేంజర్ షూటింగ్ లో పాల్గొనన్నప్పటికీ కొన్ని సన్నివేశాలని శైలేష్ కోలనే డైరెక్ట్ చేస్తున్నట్లు తెలుస్తుంది.

వైజాగ్ లో జరుగుతున్న కొత్త షెడ్యూల్ లో రామ్ చరణ్ పై ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. అయితే కేవలం చరణ్ సీన్స్ మాత్రమే కాకుండా, వైజాగ్ లో చేయవల్సిన కొన్ని సీన్స్ ని కూడా ఒకే సమయంలో చేస్తున్నారని తెలుస్తుంది. మల్టీపుల్ టీమ్స్ ని ఏర్పాటు చేసి ఒకే సమయంలో వైజాగ్ లోని పలు ప్రాంతాలు షూటింగ్ ని జరుపుతున్నారని తెలుస్తుంది. దీనితో ఒక సెట్ లో శైలేష్ కొలను పాల్గొని డైరెక్ట్ చేస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories