వాళ్లు చావును నిర్దేశిస్తే.. బాబు బతుకును చూపించాడు!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల అరాచకత్వం, కబ్జాకోరుతత్వం, పేదలు పలుకుబడి లేని వారి ఆస్తులు కనిపిస్తే చాలు వాటిని- కనురెప్పకు తెలియకుండా కంటిని పెకలించినట్టుగా కాజేసే తత్వం ఇవన్నీ కలిసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో ఒక నిండు కుటుంబాన్ని పొట్టన పెట్టుకున్నాయి. అధికార పార్టీ నాయకుల భూదాహం, అక్రమబాగోతాలు ఒక కుటుంబాన్ని నిస్సహాయ స్థితిలోకి నెట్టేసి.. ఇక జీవించడమే వృథా అనే భావనను కలుగజేశాయి. కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడ్డారు. నలుగురున్న కుటుంబంలో ఒక్క కూతురు మాత్రమే మిగిలింది. అయితే వైసీపీ నాయకుల దందాలు ఆ కటుుంబంలో ముగ్గురిని బలి తీసుకుంటే..

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు మాత్రం ఆ కుటుంబంలో మిగిలిన ఒక్క అమ్మాయికీ బతుకును చూపించారు. తెలుగుదేశం స్థానిక నాయకుల ద్వారా.. ఆ కుటుంబంలో మిగిలిన కూతురు తో మాట్లాడిన చంద్రబాబునాయుడు.. ఆమె జీవితంలో స్థిరపడే వరకు ఆమెకు సంబంధించిన బాధ్యత పూర్తిగా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని భరోసా ఇచ్చారు.

వివరాల్లోకి వెళితే.. కడప జిల్లా ఒంటిమిట్టలోని సుబ్బారావు అనే చేనేత కార్మికుడికి తన ముందు తరాల వారినుంచి వారసత్వంగా సంక్రమించిన భూమి ఉంది. ఆయనకు ఇద్దరు కూతుళ్లు. చేనేత మగ్గం పొట్ట నింపక పోవడంతో ఇతర వ్యాపారాలు కూడా చేసుకుంటూ బతుకుతున్నాడు. కానీ.. ఇటీవలి కాలంలో అప్పుల ఒత్తిడి పెరగడంతో ఉన్న పొలాన్ని అమ్మి అప్పులు తీర్చి బతకాలని అనుకున్నాడు. తీరా చూస్తే ఆయన పొలం కాస్తా కట్టా శ్రావణి అనే మరో మహిళ పేరు మీదకు మారిపోయి ఉంది. వారసత్వంగా తనకు సంక్రమించిందనే రికార్డులు అన్నీ తీసుకువెళ్లి అధికార్లకు చూపించినా.. పేరు మార్చడం గురించి వారు పట్టించుకోలేదు. ఈలోగా స్థానిక వైసీపీ నాయకుల నుంచి ఒత్తిళ్లు బెదిరింపులు వచ్చాయి. ఆ భూమి కడప-రేణిగుంట మధ్య కొత్తగా వేయబోతున్న ఫోర్ లైన్ రోడ్డుకు పక్కనే ఉండడంతో భూబకాసురుల కన్ను పడింది. వైసీపీనేత కట్టా నారాయణయ్య అనుచరులే ఈ పనికి పాల్పడినట్టుగా సుబ్బారావు కలెక్టరు పేరుతో సూసైడ్ నోట్ లెటరుగా రాశారు. దానినే మరణ వాంగ్మూలంగా భావించాలని రాశారు. హైదరాబాదులోని తన పెద్దకుమార్తె నిత్యకు ‘బిడ్డా జాగ్రత్త ఎవరినీ నమ్ముకోవద్దు.. మమ్మీ, డాడీ, విన్నీ’ అని మెసేజీ పంపారు. సుబ్బారావు రైలుకింద పడి ఆత్మహత్య చేసుకోగా, ఆయన భార్య పద్మావతి, చిన్నకూతురు వినయ ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. పెద్దకూతురు నిత్య ఒక్కటే మిగిలింది.

ఆ అమ్మాయితో ఆదివారం సాయంత్రం చంద్రబాబునాయుడు స్వయంగా మాట్లాడారు. వైసీపీ నాయకులు ఆ కటుంబాన్ని బలి తీసుకోగా, చంద్రబాబునాయుడు మిగిలిన అమ్మాయికి బతుకు చూపించారంటూ అందరూ మాట్లాడుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories