ఇండియాని షేక్‌ చేస్తా!

యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘భైరవం’ మే 30న రిలీజ్ కి రెడీ అయింది. విజయ్ కనకమేడల డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో మంచు మనోజ్, నారా రోహిత్ కూడా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో బెల్లంకొండ శ్రీనివాస్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

తన సినిమాతో ఇండియాను షేక్ చేస్తానని చెబుతున్నాడు ఈ హీరో. అయితే తాను చేయబోయే నెక్స్ట్ చిత్రం ‘హైందవ’ గురించి ఆయన ఈ కామెంట్ చేశాడు. లుధీర్ బైరెడ్డి అనే డైరెక్టర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా హై స్టాండర్డ్స్ లో ఉంటుందని.. దశావతారాల చుట్టూ ఈ సినిమా నడుస్తుందని.. ఈ సినిమా తన కెరీర్ కి గేమ్ ఛేంజర్ అవుతుందని ఆయన అన్నాడు.

తన నెక్స్ట్ మూవీ పై బెల్లంకొండ శ్రీనివాస్ ఇంత కాన్ఫిడెంట్ గా ఉండటం చాలా మంచి విషయం. మరి భైరవం మూవీతో ఈ హీరో ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.

Related Posts

Comments

spot_img

Recent Stories