నాకు రష్మిక లాంటి పాత్ర చేయాలనుందంటున్న మిస్‌ వరల్డ్‌!

మిస్ వరల్డ్, నటి మానుషి చిల్లర్ ‘యానిమల్’పై ప్రశంసలు కురిపించిది. సందీప్ రెడ్డి తెరకెక్కించిన ఈ మూవీలో రణ్ బీర్, రష్మిక, త్రిప్తి డిమ్రిలు ప్రధాన పాత్రల్లో నటించగా విమర్శలతోపాటు ప్రశంసలు కూడా అందుకుంది ఈ మూవీ. అయితే రీసెంట్ గా వరుస సినిమాలు చేస్తున్న మానుషి.. ప్రస్తుతం ‘బడే మియాన్ ఛోటే మియాన్’తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా పాల్గొన్న నటి.. ఈ మధ్య కాలంలో తనకు ‘యానిమల్’ మూవీ  బాగా నచ్చిందని పేర్కొంది. ‘నాకు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా అంటే చాలా ఇష్టం. ఆయన సినిమాల్లో నటించాలని ఆశగా ఉంది. ‘యానిమల్’ సినిమాలో రష్మిక, త్రిప్తిల పాత్రలు చాలా బాగున్నాయి. ఆసక్తికరంగా అనిపించాయి. నాకు రష్మిక పాత్రలో నటించాలని ఉంది.

భర్త ఎలా ఉన్న ఒక బాధ్యత గల భార్యగా ఆమె అతని కోసం నిలబడటం ఆదర్శంగా అనిపించింది. ధైర్యంగా ఉండగలిగింది. రష్మిక యాక్టింగ్ సూపర్. ఈ సందర్భంగా మానుషి నాకు ఇలాంటి సవాలు చేసే పాత్రల్లో నటించాలనుంది’ అంటూ తన మనసులో మాట అభిమానులతో పంచుకుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories