నటిగా తన పాత్ర కోసం ఎంతకైనా సిద్ధంగా ఉండే వ్యక్తిత్వం అమలాపాల్ది. తనలో ఉన్న ఆర్టిస్టిక్ కమిట్మెంట్ వల్లే ప్రతి పాత్రలో అంతగా లీనమవుతుంది. ఇప్పటివరకు చేసిన చిత్రాల్లో ఎంతో బోల్డ్ గా కనిపించిన అమలాపాల్, “ఆడై” అనే తమిళ సినిమాలో అయితే అంచనాలు తలకిందులయ్యేలా చేసింది. తెలుగులో అదే సినిమా “ఆమె” పేరుతో విడుదలై సంచలనం రేపింది.
ఈ సినిమాలో అమలాపాల్ నగ్నంగా కనిపించే ఓ ముఖ్యమైన సన్నివేశాన్ని చిత్రీకరించిన సంగతి తెలిసిందే. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తలచుకున్న ఆమె, అప్పటి అనుభవాన్ని వివరించింది. ఆ సీన్ సమయంలో తన చుట్టూ ఉన్న వారంతా మగవాళ్లు కావడంతో మొదట్లో కొంత అసహజంగా అనిపించిందని చెప్పింది. అయితే ఆ సన్నివేశంలో తాను భావోద్వేగంగా కనపడాలంటే, అందరూ తన భర్తలని అనుకొని యాక్ట్ చేయాలన్న నిర్ణయం తీసుకుందని చెప్పింది.
అలాంటి సన్నివేశాన్ని చేయడం తేలిక కాదు, కానీ సినిమా అవసరం కోసం అంతవరకూ వెళ్లాల్సి వస్తుందని ఆమె తెలిపింది. ఆ రోజు తన మనసులో చాలా సందేహాలు, ఆందోళనలు ఉండేవి. సెట్లో ఎవరెవరు ఉంటారు, భద్రత ఎలా ఉంటుందన్న అనేక ప్రశ్నలతో షూటింగ్కి వెళ్లిందట. చివరికి సెట్లో ఉన్నవాళ్లంతా — కెమెరామెన్, లైటింగ్ టీం మినహా — మొత్తానికి 15 మందే ఉండడం కొంతమేర భద్రతను కలిగించిందని చెప్పింది.
ఆమె నటించిన ఆ సన్నివేశం ప్రేక్షకుల మనసులో బాగా నాటుకుంది. పాత్ర కోసం చేసిన ఆ డెడికేషన్ అమలాపాల్ ఎంతవరకైనా వెళ్లగలదని మళ్ళీ మరోసారి నిరూపించింది.