దుళ్లకొట్టేయాలంతే..చైతూ హాట్‌ కామెంట్స్‌!

చందు మొండేటీ డైరెక్షన్‌ లో అక్కినేని నాగచైతన్య ప్రధాన పాత్రలో యాక్ట్‌ చేస్తున్న సినిమా తండేల్‌.ఈ సినిమాలో చైతు సరసన సాయి పల్లవి హీరోయిన్‌ గా చేస్తుంది. సినిమాలో హీరో అనుకోకుండా పాక్‌ జలాల్లోకి ప్రవేశించి, మళ్లీ భారత్ కి తిరిగి రావడానికి ముందు రెండేళ్లు జైలు జీవితం గడిపిన రాజు నిజ జీవిత కథ. దానిని ఆధారంగా చేసుకుని ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది.

 తాజాగా శ్రీకాకుళంలో ఈ సినిమా షెడ్యూల్‌ ను పూర్తి చేసుకుంది. దీనికి సంబంధించి ఓ కార్యక్రమానికి సంబంధించిన ఓ వీడియోను మూవీ మేకర్స్‌ సోషల్‌ మీడియాలో పంచుకుంది. సినిమా నెక్ట్స్‌ షెడ్యూల్‌ వచ్చే నెలలో మొదలు కాబోతుంది.

ఇక నుంచి సినిమా విడుదల అయ్యేంత వరకు కూడా సినిమా నుంచి వరుస అప్డేట్లు రానున్నట్లు మూవీ మేకర్స్‌ తన అధికారిక సోషల్‌ మీడియా ఖాతా ద్వారా తెలిపింది. ఈ సినిమాని ఈ ఏడాది డిసెంబర్‌ 20న విడుదల చేసేందుకు ముహుర్తం ఫిక్స్‌ చేశారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories