సైంధవుల ప్రయత్నాలకు చెక్ పెట్టిన  హైకోర్టు!

నిరుద్యోగ ఉపాధ్యాయుల కలలు తీర్చడం అనేది ఐదేళ్లపాటు పాలన సాగించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సాధ్యం కాలేదు. చంద్రబాబు నాయుడు మెగా డీఎస్సీ నిర్వహిస్తాననే హామీతో ఎన్నికల్లో గెలిచి.. ఏడాది తిరగకముందే డీఎస్సీ నిర్వహిస్తున్న నేపథ్యంలో.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓర్వలేక పోతున్నారు. వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ జరిగి విద్యారంగం ససంపన్నంగా తయారు కావడమే ఇష్టం లేని జగన్ దళాలు.. తెరవెనుక నుంచి నడిపిస్తూ హైకోర్టులో డీఎస్సీ ఆపు చేయించడానికి దావాలు వేయించడం గమనార్హం. అయితే హాల్ టికెట్లు కూడా జారీ అయిన ప్రస్తుత పరిస్థితులలో ‘డీఎస్సీ రద్దు కుదరదు’ అని హైకోర్టు విస్పష్టమైన తీర్పు చెప్పింది. ఇందుకు సంబంధించి దాఖలైన అన్ని పిటిషన్లను తోసిపుచ్చింది.

మరో రెండు రోజుల్లో డీఎస్సీ షెడ్యూలు ప్రకారం రాత పరీక్షలు మొదలు కాబోతున్న సంగతి అందరికీ తెలుసు. ఇలాంటి సమయంలో డీఎస్సీని రద్దు చేయాలని కోరుతూ దాఖలైన అనేక పిటిషన్లు హైకోర్టు ఎదుటకు వచ్చాయి. 2024లో జగన్ డీఎస్సీ పేరుతో డ్రామా ప్రకటన చేసినప్పుడు వయస్సు పరంగా తమకు అర్హత ఉన్నదని, 2025లో వచ్చిన నోటిఫికేషన్ ప్రకారం అర్హత కోల్పోయామని కనుక ఈ డి ఎస్ సి ని రద్దు చేయాలని కొందరు వాదించారు.
ఇలా రకరకాల కారణాలు చూపిస్తూ వేర్వేరు పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఇవన్నీ కూడా కేవలం డీఎస్సీ జరగకుండా చేయడానికి, తద్వారా కూటమి ప్రభుత్వానికి రాగల మంచి పేరును అడ్డుకోవడానికి జరిగిన కుటిల ప్రయత్నాలు మాత్రమే! అయితే ఇలాంటి దావాల విషయంలో హైకోర్టు జాగ్రత్తగానే వ్యవహరించింది.
పరీక్షలు మొదలు కాబోతున్న సమయంలో ఇప్పుడు రద్దు చేయడం సాధ్యం కాదని తెలిపింది. అర్హతల విషయంలో గాని పిటిషనర్లు పేర్కొన్నట్టుగా ఏడాదికి రెండుసార్లు టెట్ నిర్వహించాలని నిబంధనల విషయంలో గానీ పసలేదని వ్యాఖ్యానించింది. పరీక్షలకు సిద్ధం కావడానికి 90 రోజుల గడువు ఇవ్వాలనడంలో హక్కు లేదని పేర్కొంది.  మొత్తానికి డీఎస్సీ నిర్వహణకు న్యాయపరంగా ఎదురు కాగల ఆటంకాలు కూడా తొలగిపోయాయి. వైసిపి కుట్రలు వీగిపోయాయి. డీఎస్సీ యధాతధంగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం జరగబోతోంది. త్వరలోనే వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ కాబోతున్నాయి అని ప్రజలు సంతోషిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories