ఇదో శుభప్రదమైన ప్రయాణం!

జూనియర్ ఎన్టీఆర్ గత మూడు రోజులుగా కుటుంబ సమేతంగా కర్ణాటక లోని ప్రముఖ పురాతన దేవాలయాల్ని దర్శించుకుంటున్నారు. ఆయన, తాజాగా కేశవనాథేశ్వర గుహ ఆలయాన్ని ఎన్టీఆర్ దర్శించుకున్నారు. కాంతార హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి ఇల్లు ఉన్న కెరడి మూడగల్లు గ్రామ సమీపంలో ఈ పురాతన ఆలయం ఉంది. ఎన్టీఆర్ తన కుటుంబంతో పాటు హీరో రిషబ్ శెట్టి, అతని భార్య ప్రగతి శెట్టి, అలాగే దర్శకుడు ప్రశాంత్ నీల్, ఆయన భార్య లిఖిత కూడా కేశవనాథేశ్వర గుహలో కొలువై ఉన్న పరమేశ్వరుని దర్శించుకున్నారు.

కేశవనాథేశ్వర గుహ చుట్టూ ఉన్న ప్రాంతంలోని సహజ సౌందర్యానికి ఎన్టీఆర్ ఆకర్షితుడయ్యాడని.. ఆ అటవీ ప్రాంతం లోని పురాతన గుహలో
స్వయంభువుగా కొలువైన ఆ పరమేశ్వరుడిని తారక్‌ తో కలిసి దర్శించుకోవడం గొప్ప అనుభూతి అని రిషబ్‌ శెట్టి ఓ వీడియోని షేర్ చేస్తూ తాజాగా హీరో రిషబ్‌ శెట్టి తన ట్విట్టర్ ద్వా రా తెలియజేశాడు.

రిషబ్ శెట్టి ” నా బెస్ట్‌ ఫ్రెండ్‌, నా ప్రియమైన సోదరుడు, కొన్ని జ్ఙాపకాలు, కొన్ని ఆశీర్వాదాలు, ఆ నవ్వుల రాజు జూనియర్‌ ఎన్టీఆర్‌ తో కలిసి మూడగల్లు కేశవనాథేశ్వర ఆలయ దర్శనం ఒక శుభప్రదమైన ప్రయాణం’ అని రిషబ్ పేర్కొన్నాడు.

Related Posts

Comments

spot_img

Recent Stories