పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా సినిమా ‘హరిహర వీరమల్లు’ గురించి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే మెజారిటీ షూటింగ్ ముగించుకున్న ఈ సినిమా ప్రస్తుతం చివరిదశ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాని ప్రముఖ నిర్మాత ఏ.ఎం.రత్నం భారీ బడ్జెట్తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.
అయితే, ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ‘హరిహర వీరమల్లు’ సెట్స్లో ఆయన కేక్ కట్ చేశారు. ఈ వేడుకలో మూవీ యూనిట్ సభ్యులు అందరూ పాల్గొన్నారు. తమ ప్రొడ్యూసర్కి వారందరూ బర్త్ డే విషెస్ తెలిపారు. ఇక ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుందని,ఆ విషయం ఎంతో సంతోషంగా ఉందని ఏఎం.రత్నం తెలిపారు.
ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా బాబీ డియోల్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు.