పవన్‌ ఫ్యాన్స్‌ కు గుడ్‌ న్యూస్..ఏంటో తెలుసా!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తమ హీరో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో పాటు ప్రస్తుత క్యాబినెట్ లో మంత్రిగా, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టడంతో ఫుల్ ఖుషీలో ఉన్నారు. కానీ పవర్ స్టార్ ను మరో సారి సిల్వర్ స్క్రీన్ ఫై చూడాలని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ప్రస్తుతం పవన్  రాజకీయాల్లో బిజీగా ఉండడంతో ఈ హీరో నటిస్తున్న సినిమాల సంగతి అయోమయంలో పడ్డాయి. పవన్ సినిమాల్లో నటిస్తాడా లేదా అన్న డైలమా అందరిలోనూ ఉంది.వినిపిస్తున్న టాక్‌ ప్రకారం త్వరలోనే ఫ్యాన్స్ ముందుకు ఓ గుడ్ న్యూస్ తో రాబోతున్నట్టు సమాచారం. అయితే కొద్ది రోజుల క్రితం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను నిర్మాత డీవీవీ దానయ్య కలిశారు.

 పవన్ తో OG చిత్రాన్ని నిర్మిస్తున్నారు నిర్మాత దానయ్య. దాదాపు 70% షూటింగ్ ని ఈ సినిమా పూర్తి చేసుకుంది. పవన్ కళ్యాణ్ కు సంబంధించి కేవలం పది లేదా పదిహేను రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నట్లు టాక్‌. ఓజీని త్వరలోనే పూర్తి చేస్తానని డీవీవీకి పవన్‌ హామీ ఇచ్చారని సమాచారం.

ఈలోగా పవన్ ఇలా వస్తే సినిమాలోని కీలక సన్నివేశాలను వెంటనే  పూర్తి చేసేందుకు అటు నిర్మాత దానయ్య , ఇటు దర్శకుడు సుజిత్ ఏర్పాట్లు చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. త్వరలోనే OG సెట్స్ లో పవన్ కళ్యాణ్ పాల్గొననున్నాడని సమాచారం. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన టీజర్ తో ఫ్యాన్స్ అంచనాలు తార స్థాయికి చేరుకున్నాయి.

Related Posts

Comments

spot_img

Recent Stories