మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్

వైసీపీ నేత, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌ ను పోలీసులు గురువారం ఉదయం హైదరాబాద్‌ లో అరెస్ట్‌ చేశారు. మంగళగిరిలోని టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో నందిగం సురేష్‌ పై కేసు నమోదైంది. ఈ కేసులో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని ఆయన  పిటిషన్‌  దాఖలు చేయగా దానిని హైకోర్టుకొట్టేసింది.

దీంతో ఆయన్ని అరెస్ట్‌ చేసేందుకు బుధవారం తుళ్లూరు పోలీసులు ఆయన ఇంటికి చేరుకున్నారు. అయితే అప్పటికే సురేష్‌ ఇల్లు విడిచి అజ్ఙాతంలోకి వెళ్లిపోయారు. తన మొబైల్‌ కూడా స్విచ్ఛాఫ్‌ చేశారు. దీంతో పోలీసులు చాలా సేపు అక్కడే ఉండి చూశారు. కానీ లాభం లేకపోయేసరికి వెనక్కి వెళ్లిపోయారు.

సురేష్‌ సెల్‌  సిగ్నల్స్‌ ఆధారంగా బుధవారం ఉదయం నుంచి ఆయన ఎక్కడున్నారో పోలీసులు విచారణ మొదలు పెట్టారు. హైదరాబాద్‌ నుంచి పారిపోయేందుకు సురేష్‌ ప్రయత్నిస్తున్నారనే పక్కా సమాచారం అందడంతో హైదరాబాద్‌ వెళ్లిన ప్రత్యేక బలగాలు ఆయన్ని అరెస్ట్‌ చేసి మంగళగిరి తరలిస్తున్నట్లు తెలిపారు.

Related Posts

Comments

spot_img

Recent Stories