తెలుగు రాష్ట్రాలకు విరాళం ప్రకటించిన తొలి తమిళ హీరో!

ప్రస్తుతం మన రెండు తెలుగు రాష్ట్రాల్లో వరదల బీభత్సం ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలిసిన విషయమే. దీంతో మన తెలుగు స్టార్ హీరోలు  అంతా కూడా భారీ మొత్తంలో విరాళాలు ప్రకటించి మంచి మనసును చాటుకున్నారు.  ఇక హీరోయిన్స్ నుంచి అయితే తెలుగు యంగ్ నటి అనన్య నాగళ్ళ 5 లక్షలు ప్రకటించింది. అయితే ఇప్పుడు మొట్ట మొదటి సారిగా ఓ తమిళ్ హీరో స్పందించాడు.

ఇంతకీ ఆ నటుడు ఎవరో కాదు శింబు. శింబు ఒకప్పుడు తెలుగులో కూడా సాలిడ్ హిట్స్ ని అందుకున్న సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు తమిళ్ లో పలు సినిమాలు చేస్తుండగా తన నుంచి మరీ అంత ఎక్కువ సినిమాలు తెలుగులో డబ్బింగ్ అయి విడుదల కావడం లేదు.  అయినా కూడా ఇతర స్టార్స్ ని మించి తన గొప్ప మనసుని చాటుకున్నాడని చెప్పుకోవచ్చు.

మరి రెండు తెలుగు రాష్ట్రాలకి గాను శింబు 6 లక్షల విరాళాన్ని సహాయనిధి అందిస్తున్నట్టుగా ప్రకటించాడు. దీంతో తమిళ్ నుంచి తెలుగులో ఎన్నో సినిమాలు రిలీజ్ చేసుకుంటూ లాభాలు పొందిన హీరోలు చేయనిది మొట్టమొదటిగా శింబు చేసాడని తెలుగు ఆడియెన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి తనని చూసి అయినా మరింతమంది తమిళ హీరోలు ఏమన్నా స్పందిస్తారేమో చూడాలి.

Related Posts

Comments

spot_img

Recent Stories