మరోసారి రిపీట్‌ కాబోతున్న ఫిదా కాంబినేషన్‌!

టాలీవుడ్‌ యంగ్‌ హీరో వరుణ్‌ తేజ్‌, స్టార్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల కాంబోలో వచ్చిన సూపర్‌ హిట్‌ సినిమా ఫిదా. ఈ సినిమా వరుణ్‌ తేజ్‌ కెరీర్‌ లోనే ది బెస్ట్ మూవీగా నిలిచిపోతుంది. ఈ సినిమాలో క్యూట్ , నేచురల్‌ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. 2017 లో వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాతోనే సాయి పల్లవి తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం అయింది.

ఈ సినిమాలో తన యాక్టింగ్ ,డాన్స్ తో ప్రేక్షకులలో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఫిదా సినిమా సూపర్ హిట్ కావడంతో సాయి పల్లవి తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంది.అతి తక్కువ కాలంలోనే సాయి పల్లవి స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఇదిలా ఉంటే ఫిదా కాంబోమరోసారి రిపీట్ కానుందని సమాచారం. దర్శకుడు శేఖర్ కమ్ముల మరో అద్భుతమైన కథను హీరో వరుణ్ తేజ్ కు చెప్పినట్లు సమాచారం.

శేఖర్ కమ్ముల కథ చెప్పిన వెంటనే వరుణ్ తేజ్ ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం శేఖర్ కమ్ముల స్టార్ హీరో ధనుష్ హీరోగా “కుబేర” సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో నాగార్జున కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.  అలాగే వరుణ్ తేజ్ మట్కా అనే సినిమాతో బిజీ గా ఉన్నాడు.

Related Posts

Comments

spot_img

Recent Stories