నోరు పారేసుకోకు…నెక్ట్స్‌ జైలుకు నువ్వే!

ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏనాడు కూడా జనంలోకి వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకున్న పాపాన పోలేదని నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు.  జగన్ లాగా చంద్రబాబు నాయుడు ప్యాలెస్ లకు పరిమితం కాలేదు.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి జనంలోనే ఉంటూ.. రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడుతున్నారని పేర్కొన్నారు.

చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి కలిసి రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం సమావేశం అవడం శుభపరిణామమని చెప్పుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రం ఎన్ని విధాలుగా నాశనం అవ్వాలో అన్ని విధాలుగా సర్వ నాశనం అయిందని విమర్శలు గుప్పించారు. ఐదేళ్ళలో మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి దోచుకున్నది బయటపెడతానని.. చంద్రబాబుపై అనవసరంగా నోరు పారేసుకుంటున్నారని సోమిరెడ్డి మండిపడ్డారు. కాకాణి గోవర్దన్ రెడ్డి చేసిన అవినీతి గురించి తీస్తే వారానికి ఒక సీరియల్ లా వస్తాయిని.. త్వరలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి  తోడుగా కాకాణి జైలుకు వెళ్లడం ఖాయమని ఆయన అన్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories