విడాకులు తరువాత …ఒకే వేదిక మీద సమంత-నాగచైతన్య

తెలుగు చిత్ర పరిశ్రమకు ఏం మాయ చేసావే సినిమాతో అడుగుపెట్టిన సమంత ఆ సినిమా సమయంలోనే అక్కినేని నాగ చైతన్యతో ప్రేమలో పడి ఆరు సంవత్సరాల తరువాత పెద్దల సమక్షంలో వివాహం చేసుకుంది. అయితే ఇద్దరికీ భేదాభిప్రాయాలు రావడంతో విడాకులు తీసుకుని విడివిడిగా ఉంటున్నారు.

ఈ సమయంలోనే సమంత మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడడం , తరువాత కోలుకోవడం జరిగాయి. అయితే సమంత మీద మాత్రం అక్కినేని ఫ్యాన్స్ పిచ్చ కోపంగా ఉండి ఆమె మీద విపరీతమైన నెగిటివీటిని కూడా ప్రచారం చేశారు. దీంతో ఆ విషయం కాస్త పోలీసు స్టేషన్ల వరకు వెళ్లడం తరువాత అవి సద్దుమణగడం కూడా జరిగింది.

అయితే విడాకులు తరువాత అటు చైతన్య కానీ, ఇటు సమంత కానీ ఎక్కడ కూడా ఒకరి గురించి ఒకరు బహిరంగంగా మాట్లాడలేదు. ఎదురుపడడం కానీ జరగలేదు. అయితే తాజాగా వీరిద్దరూ ఒకే కార్యక్రమానికి హాజరయ్యారు. ఇద్దరు ఒకే వేదిక మీద వేరువేరు సమయాల్లో తమ ప్రాజెక్టులకు సంబంధించిన విషయాలను ప్రమోట్‌ చేసుకున్నారు. ముంబై వేదికగా అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ఇండియా కంటెంట్‌ ని మంగళవారం అనౌన్స్‌ చేసింది.

ఈ ఈవెంట్ కి పలు సినిమా యూనిట్స్‌ వెబ్‌ సిరీస్‌ యూనిట్స్ హాజరై తమ ప్రాజెక్టులను అనౌన్స్‌ చేశారు. ఈ కార్యక్రమానికి ముందుగా నాగచైతన్య హాజరు కాగా దూత వెబ్‌ సిరీస్ కి సీక్వెల్‌ గా దూత 2 త్వరలోనే అమెజాన్ ప్రైమ్‌ లోకి రాబోతుందని తెలిపారు. ఆ తర్వాత మరో నాలుగు ప్రాజెక్టులు ప్రకటించిన తరువాత సమంత వేదిక మీదకు వచ్చి సిటాడెల్‌ ఇండియన్‌ వెర్షన్‌ వెబ్‌ సిరీస్‌ ని ప్రమోట్‌ చేసుకుంది.

ఇద్దరు వేరు వేరు సమయాల్లో తమ వెబ్‌ సిరీస్‌ లను ప్రమోట్‌ చేసుకున్నప్పటికీ ఒకే ఈవెంట్‌ కు హాజరయ్యారు. కానీ ఒకరికి ఒకరు ఎదురుపడ్డారో లేదో మాత్రం తెలియదు.

Related Posts

Comments

spot_img

Recent Stories